పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

321


ప్రాయ మ దెట్టిదో! తెలియఁబల్కితివేని ఫలించు దీన నే
మో యనఁబోకు నీకు మదిమోద మొనర్చెద రమ్ము నమ్మికన్.

292


ఉ.

దానికి దానవుం డతిముదంబున రాముఁడు చేతఁజిక్కె నె
ట్లైన మదీప్సితంబు ఫలియించె నటంచు గణించి పల్కె నో
హో నలినాక్ష! యో హలి! మదుత్కటరోషము నెన్న నేల దు
ర్మాని కురుక్షితీశు నవమానము జేయదలంచి తింతియే
గాని జగద్ధితాత్ము లవికారులు మీ కొకకీడు కూర్తునే.

293


శా.

ఐనా నామది నొక్కకోర్కె గల దెట్లంటేని నేఁ డీకురు
క్ష్మానాథున్ హతశేషసేనలను వీకం ద్వారకాప్రాంత మెం
దేని న్నిల్వఁగనీక బోఁదఱిమితే యేనై భవత్సన్నిధిం
ధ్యానప్రీతిని విన్నవింతు నపరాధక్షాళనార్థోక్తులన్.

294


చ.

అనుచు నదభ్రవిభ్రమమహాభ్రరవభ్ర మనభ్రవీథి భో
రున వడిమ్రోయఁగా విని కురుక్షితనాథముఖావనీశు లా
ర్తిని హతశేషసైన్యవితతిన్ విడనాడి వినిర్గతావలే
పనమతిఁ దా మొకం డొకని బట్టుక నేగిరి హస్తినాపురిన్.

295


మ.

విరథు ల్వీతనిజాశయుల్ విగతదోర్వీర్యు ల్విహీనాయుధుల్
విరసోద్యోగులు విప్రయత్నమతులై నేపాఱుభూపాలి నం
బరమందుండి ఘటోత్కచుండు గని కోపంబెల్ల బోకార్చి గ
హ్వరికిం డిగ్గి హరిన్ హలాయుధుని డాయన్వచ్చి నమ్రాస్యుఁడై.

296


మ.

నిటలన్యస్తకళాంజలుం డగుచు సాన్నిధ్యంబునం జేరి ని
ష్కుటిలప్రీతి పునఃపునఃప్రణమితాంగుండై సభక్తిస్ఫుర
ద్ఘటనం బల్కి నిజాపరాధములు సాకల్యంబు బోకార్ప ధూ
ర్జటిజూటానటదభ్రనిర్జరచరజ్ఝంకారవాచార్భటిన్.

297