పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

తాలాంకనందినీపరిణయము


మ్మానిని దెల్పఁగా నతఁ డమర్షత నీర్ష్యను బూని యభ్రపం
ఛానము జేరి కౌరవుల హుంకృతి బాపె నదృశ్యరూపుఁడై.

286


ఉ.

తల్లియు తమ్ముడు న్వెతలఁ దల్లడమందుటచే ఘటోత్కచుం
డుల్లమునన్ సహింపక శుభోత్సవభంగ మొనర్చె కూఁతు మే
నల్లున కిత్తునంచు నికనైన దృఢస్థితి నీవు బల్కితే
నుల్లసితాత్ముఁడై దనుజుఁ డుర్విని దిగ్గి శమించు నింతయున్.

287


చ.

సలలితమౌ మదుక్తికి బ్రసన్నుఁడవై యెలుఁగెత్తి దానవుం
బిలచి తదాశయం బెఱిఁగి బ్రీతి సమస్తజనానుకూలని
ర్మలమతి నాత్మపుత్రి నభిమన్యునకుం భగినీమనోరథం
బలవడ పెండ్లిసేయుట నయం బభయంబు ప్రియం బికెన్నిఁటన్.

288


ఉ.

వ్యర్థమనీషుఁ డౌ కురుగులాత్మజు నర్థి వరించుకంటె ని
ప్పార్థతనూజుఁడే మనకు బాధ్యుఁడు సాధ్యుఁడు నేఁటికైన యీ
యర్థము మీఱ లియ్యకొని యవ్యవధి న్సమకూర్చుటే మహా
సార్థకమంచు దోఁచె మది సంశయమేల ప్రలంబభేదనా.

289


మ.

అనుచున్ శౌరి వచించు సజ్జనహితంబౌ నీతివాక్యంబులన్
విని డోలాయితబుద్ధి కొంతతడవు న్వీక్షించి గోవింద నీ
కనుకూలం బెటు గల్గునో యట జయం బౌ టబ్రమే లోకవ
ర్తనవైశద్యవిభాగనిర్ణయకళాధారుండ వీ వౌటచేన్.

290


క.

ఈవిధమున ననుకూలుం
డై వచియింపుచు నిజానుజానుమతి సుహృ
ద్భావమున నాఘటోత్కచు
నావాహనజేయ నిట్టులని యెలుఁగెత్తెన్.

291


ఉ.

ఓయి ఘటోత్కచా! దివి మహోగ్రపరాక్రమశాలివై జయం
బీయెడ జెంది తీపు తమి నింకిటమీఁద శమించి నీయభి