పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

తాలాంకనందినీపరిణయము


బగు ద్వారకాపురముకడ
డిగి మెల్లన సందెచీఁకటిం బురిసొచ్చెన్.

53


చ.

ఎలమిని దా నదృశ్యత వహించి పురంబును జొచ్చి వీథివీ
థులు బరికించి కాహళికదుందుభితూర్యము లాలకించి యా
బలుని నిశాంతముం జొరఁగ బాఱి వివాహమహోత్సవత్వరన్
మెలఁగెడువారి సందడు లమేయకృధారసదృష్టి గన్గొనన్.

54


సీ.

కవగొన్న మణిదీపకళికలకడ నిల్చి
        యెలిమి నొండొరు లంద మెన్నువారి
మొనసి పన్నీటిచెంబులు నింపి వియ్యంపు
        టిరుగడ దొరల కందిచ్చువారి
సుమగుళుచ్ఛములు కస్తూరీకరాటముల్
        బూని హర్షమున నుప్పొంగువారి
నెమ్మి సంపెగనూనియబుడ్ల నటుడించి
        సొమ్ముల నాణెముల్ జూచువారి


తే.

వచ్చిరదె పెండ్లివారు సవాఁరి జూడ
పదుపదుండని తోదోపు లొదుగువారిఁ
గినిసి గని పండ్లు పటపట గీటుకొనుచు
రాక్షసేశ్వరుఁ డంతఃపురమున వెదకి.

55


మ.

ఒకచోటం దనతోటిచేడియల సంయోగంబు వర్ణించి నా
యకచింతావివశాత్మయై కుసుమశయ్యం జెందు తాలాంకపు
త్రిక నీక్షించి సుభద్ర మున్ను తన కర్థిం దెల్పురీతిం దొలం
గక చూడన్ శుభలక్షణంపు శశిరేఖాకన్యగా నెంచియున్.

56


క.

తరుణీమణి నాతమ్ముఁడు
వరియింపఁగ నిట్టు లుండవలదేయని సం
బరమొంది నైజమాయా
పరవశమున నిదురఁగొను నుపాయమొనర్చెన్.

57