పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

271


శకునిదుశ్శాసనాశ్వత్థామముఖ్యులు
        జాగ్రదుద్వృత్తి పార్శ్వముల నేఁగ
నైరావణోన్నతస్ఫారద్విరద మెక్కి
        కడఁగి మధ్యమున లక్ష్మణుఁడు సెలఁగ
తాను మణిగణకాంచనస్థగితరథము
నెక్కి తనయునిచేరువ ప్రక్క నిలిచి
వారివారికి ప్రియమైన వాహనముల
నెక్కివచ్చుటఁ జూచుచు వెడలె పురిని.

32


సీ.

దంతావళంబు లంతస్థశైలంబులై
        యుద్యత్తురంగంబు లూరులయ్యు
హాటకద్యుతి నొప్పు నరదము ల్దీవులై
        చటులభటుల్ నక్రచయము లయ్యు
తతహేతిసంతతిప్రతతి మీనంబులై
        చక్రముల్ జలచక్రజాల మయ్యు
కరఖేటకంబులు ఘనకచ్ఛపంబులై
        భటహుంకృతులు జలార్భటము లయ్యు
చంద్రవంశజరాజరాజేంద్రురాక
కలరి చతురంగసైన్యమహార్ణవంబు
యదుజనామరనిది తన్ను నెదురుకొనఁగ
సరసశరజాలములతోడఁ బరఁగె నడచె.

33


క.

వందిజనుల్ వైతాళిక
బృందములుం బొగడ దుందుభీతూర్యములం
దందవడి మ్రోయ రాజపు
రందరుఁ డాద్వారకాపురముకడ విడచెన్.

34


మ.

బలభద్రుండు నృపాలురాక విని సద్భందుయుక్తంబుగా
విలసత్కాహళతూర్యనాదములు వేవే ల్మ్రోయ నుద్యత్కుతూ