పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

తాలాంకనందినీపరిణయము


హలుఁడై తోడను బుణ్యభామినులు డాయంగా నెదుర్కొంచు వే
డ్కలచే పువ్వులచప్పరంబు విడి దిండ్లం జేర్చె వేవేగమున్.

35


క.

వారల కనుభవయోగ్యం
బారసి కసనిఖిలసత్పదార్థంబులు వి
స్తారగతి నొసఁగి దత్త
త్ప్రారంభవిజృంభమాణభావుకమతియై.

36


క.

ఆమీఁదటఁ బుణ్యాంగన
లామోదము మీఱ లక్ష్మణాభిఖ్యనృప
గ్రామణికిని పరిణయదీ
క్షామంగళమజ్జనంబు గావించి రొగిన్.

37


సీ.

నీటైన గొజ్జంగినీట జల్కము లార్చి
        కురులు గోరున గీరి కొండె దీర్చి
ఘనకిరీటము మస్తకమున శృంగారించి
        సమధికవస్త్రభూషణము లొసఁగి
మృగనాభినామంబు నగుమొగంబున దీర్చి
        వన్నెపావడ వల్లెవా టొనర్చి
కటకాంగుళీయముల్ కరముల గీలించి
        యుఱుతారహారంబు లఱుత వైచి


తే.

విమలమణిమయసింహాసనమునఁ జేర్చి
నవ్యమంగళనీరాజనం బొసంగి
విధివిధాయకమున ధర్మవేద్యు లెల్ల
వెస సమావర్తనాదికవిధులుఁ దీర్చి.

38


మ.

బలభద్రుండు ధరామరప్రతతికిన్ భక్షాజ్యసూపప్రధా
నలసద్యోజనభాజనక్రియల సన్మానించి మాల్యాంబరం
బుల సద్రత్నవిభూషణంబులఁ బ్రియంబు న్మీఱ నర్పించి య
వ్వల పుత్రీమణిఁ బెండ్లికూఁతు నొనరింపంగా నియోగించినన్.

39