పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

253


ర్మోహప్రక్రియ లెందు గానము గదా! మూర్ఖాళిసంభావ్య మీ
యూహ ల్జాలుడు గుందు వైరము మదీయోక్తు ల్విన న్మేలగున్.

293


క.

మీరలు భీమార్జునులకు
మారులు రణరంగజితకుమారులు మీలో
మీరు కలహింప దుర్జయు
లీరసములు మాని యుపశమింపుడు శరముల్.

294


క.

భవదగ్రజనకుఁడై దగు
పవమానసుతుండు దనుజభామ హిడింబిం
దవిలి చరింపఁగ తద్ద్యుతి
భువిని ఘటోత్కచుఁ డనంగ బుట్టె నితండున్.

295


క.

నీ వర్జునువలన గుణ
ప్రావీణ్యత దనరు కృష్ణభగిని సుభద్రా
దేవి జఠరాంతరంబున
నావిర్భవమొందినాడవౌ నభిమన్యా!

296


క.

మీ రన్నదమ్ములై యీ
ఘోరాహవమునను బోరగూడ దటొండెన్
ధీరులు రణశూరులు దో
స్సారులు నొకరొకఱి గెలువ శక్యం బగునే.

297


మ.

అనుచు న్వారలవావులు న్వరుస లిట్లన్యోన్యసౌహార్దసం
జనితప్రక్రియ తేఁటఁగాఁ దెలిపి స్వేచ్ఛాగామియై వల్లకీ
ధ్వని నారాయణశబ్దముం గొలువ నంతర్ధాసముం జెంది నం
తనె నిర్విణ్ణమనోగతిం దడవు చైతన్యక్రియాశూన్యులై.

298


క.

మును దెలిపిన వచనంబుల
కనుతాపముఁ జెంది శరశరాసనములు స