పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

తాలాంకనందినీపరిణయము


కరి కరియుం గిరి గిరియున్
హరి హరియుం బెనఁగినట్టు లాహవ మయ్యెన్.

287


క.

అంతం దెలదెల వేగుట
లెంతయు గని దనుజుఁ డలిగి యిదిగో నిను ఖం
డింతునని యార్భటింపుచు
పంతంబున నెక్కుబెట్టె బ్రహ్మాస్త్రంబున్.

288


ఉ.

ఆమహదస్త్ర మెక్కిడుట నర్జునసూనుఁడు జూచి యుగ్రుఁడై
ధీమతి వజ్రఖండమును ద్రెంపఁగ వజ్రమెగాన దీనిను
ద్దామ మణంపఁగా నదియ దక్క మఱొండుశరంబులే దటం
చామితధైర్యధుర్యతఁ దదస్త్రము నెక్కిడునంతలోపలన్.

289


క.

ఆబ్రహ్మస్త్రము లిరువురు
చేఁబూనిన దిశలు చిట్లు చీఁకట్లమయం
బై బడబవహ్నికీలల
నాబహుళతరాగ్నికణము లవనిన్ రాలెన్.

290


చ.

ధరణితలంబు దద్దఱిలె తారలు గూలె సభంబు దిద్దిరం
దిరిగె సురాంశుభాస్కరుల దీధితి క్రుంగెను బ్రద్దలై దిశల్
దెరిచెను పచ్చిగోడలగతిం జతురంబుధు లింకె నద్రులున్
మొఱసె నభంబునన్ సురసమూహము లార్చె విమానపంక్తి త
త్తరమున డుల్లె వాయువు ధ్రువం బణఁగెం బ్రళయాంతసూచనన్.

291


ఉ.

ఆసమయంబునన్ మునికులాగ్రణి నారదమౌని యాగమో
ల్లాసుఁడు కోటిభాస్కరవిలాసుఁడు మాధవసత్కథాసుధా
భ్యాసుఁ డనారతాంచదుపవాసుఁడు వారలముందటం దయా
భాసురమూర్తియై నిలిచి బల్కె ననాగతవేది గావునన్.

292


శా.

ఓహో విక్రమధుర్యులార తగు నుద్యోగంబు బాటిల్లె ని
స్సాహాయ్యంబున నన్నదమ్ము లిటులన్ సంగ్రామముం జేయు ని