పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

229


త్రికపై మోహవిదాహతం బొరలు టింతెగాని తద్భోగ మిం
చుక చేకూరని హేతునన్ జనని కిచ్చో వెచ్చనూర్చంబడెన్.

162


క.

అహహా! యీబలుకోనల
బహుళవ్యథ స్రుక్కె గమనభరమున నేఁ డీ
మిహిరాకరాస్య నెటువలె
గహనంబున ద్వైతవనముకడ జేర్పనగున్.

163


తే.

మామ నను జేయు యీయవమానమునకు
తామసంబున వెడలునంతనె పిఱుంద
యేటి కరుదెంచె యీమృగార్భాటములకు
మనునె యీరాత్రి సుమసుకుమారగాత్రి.

164


సీ.

పదములఁ గర్కశోపలము లొత్తినవేళ
        సొటసొటబోయి యుస్సురని స్రుక్కు
మిటమిట నెండలొక్కట మిక్కుటంబైన
        మిగులపెం దగల నెవ్వగల నొగులు
బెడిదంపువడగాడ్పు లుడుకులై యెదురెక్క
        సుడిఁబడి యక్క డక్కడనె నిల్చుఁ
బెల్లాకటను దల్లడిల్లి పెల్లున బేలి
        బహుళమార్గాయాసభరము జెందు


గీ.

నిట్టి సుకుమారి నెటువలె నెట్టుకొనుచు
నడచి కౌంతేయులున్న వనంబు గాంతు
నని వితర్కించు ధైర్యంబు ననుకరించుఁ
దల్లివెత లెంచు మదిలోన దల్లడిల్లు.

165


సీ.

రమణీయమందిరారామసౌఖ్యము మాని
        ఘోరాటవులను సంచార మొదవె
కేళీసరోవరక్రీడాసుఖము వీడి
        పంకాలవాలవిభ్రమణ దవిలె