పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74 తాలంకనందినీపరిణయము


బనిచి, మహారణ్యమునకు
జనియెం ద్రుపదసుతుతోడ సహజులు గొలువన్.

318


సీ.

కుంతిని ధృతరాష్ట్రుచెంత నుంచి, సుభద్ర
     నభిమన్యు ద్వారక కనుపుటయును
ద్రౌపదితో తామరణ్యంబు జొచ్చి భీ
     ముండు కిమ్మీరుని జెండుటయును
భవుఁడు వరాహనెపమున బోరఁ జయించి
     యర్జునుం డస్త్రంబు లందుటయును
గాలకేయనివాతకవచుల నాతండు
     దివమున కేఁగి వధించుటయును


తే.

నియతమతి ద్వైతవనమున నిల్చుటయును
వినిన దుర్యోధనుఁడు విఱ్ఱవీఁగుటయును
దెలిసి జనమేజయుఁడు మోదించుటయును
నవలికథ దెల్పుమని బైలు నడుఁగుటయును.

319

ఆశ్వాసాంతము

పతాకబంధము

ఉ.

వేదపదప్రదర్శన! నవీనఘనద్యుతిదేహ దేవదే
వా! దరసారధారణ ! శుభప్రభవాభరణప్రదీప్త! దా
మోదర! వాదభేదనదమోదయ! మానసవాసవాజరు
ద్రాదిమభావ! భావితపదాంబుజ! తాపసబృందమోదదా!

320

ఖడ్గబంధము

క.

శూరవరసారకరఖర
మారణరణరంగనిహతమధుమురనరకా!
కారణసమధికనిపుణ ర
మారమణీమానసౌక! మన్మథజనకా!

321