పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 73


ఉ.

ఇమ్మెయి ధార్తరాష్ట్రుఁడు జయింపఁగ ధర్మజుఁ డాడ నాడ న
ర్థమ్ముల నోడె- గాంచనరథమ్ముల నోడె, గజాశ్వసద్భటౌ
ఘమ్ముల నోడె - సర్వకటకమ్ముల నోడె - జగత్ప్రపూజ్యరా
జ్యమ్ముల నోడె- తన్ను ననుజన్ముల నోడె నిజమ్ము నోడకన్.

313


క.

ఆతఱి ద్రుపదాత్మజబహు
రీతులఁ బాండవుల నుద్ధరించి తగ, పున
ర్ద్యూతమునకు దొరకొనఁగ వి
ఘాతకుఁడగు శకుని విషమగతి కపజితుఁడై.

314


క.

కొండారణ్యంబుల పది
రెండేడులు వెతల సంచరింపఁగ మఱియొ
క్కొండే డజ్ఞాతమ్మున
నుండఁగ నియమించె నాసుయోధనుఁ డంతన్.

315


చ.

సకలధరాధిపత్యము విసర్జనం జేసి సతీసహోదర
ప్రకరముతోడ, దా నటవి పర్యటనం బొనరింపఁబూని బా
లకు నభిమన్యు పై నెనర లంఘ్యముగావున బాయలేక కొం
డొకతడ వాత్మ చింతిలి నయోక్తులతోడ సుభద్ర కిట్లనున్.

316


క.

ఓసాధ్వి! నీవు నీసుతుఁ
డీ సమయము గడవ, పుట్టినింటికిఁ జని య
త్రాసతఁ బదమూఁ డేడులు
వాసిగ సోదరులవశత వర్తించఁదగున్.

317


క.

అని, జననీతనయుల ద
త్క్షణమే వీడ్కొల్పి ద్వారకాపురమునకుం