పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 తాలాంకనందినీపరిణయము


నాదమున మొరయు దుందుభి
నాదారక మ్రోసెఁ గ్రతువున నహర్నిశలన్.

292


సీ.

హవ్యోచితద్రవ్యనవ్యసత్కృతులచేఁ
     బ్రముదితాత్ముం డయ్యెఁ బావకుండు
వినయ సపర్యాది సనయప్రయుక్తిచే
     మది సంతసిలె రాజమండలంబు
నర్ఘ్య పాద్యాఖిలానర్ఘ్య గౌరవముచేఁ
     బరితుష్టి నొందెఁ దాపసకులంబు
షడ్రసోపేతభోజనదానవిధులచే
     సుఖు లైరి భూసురా ద్యఖిలజనులు


తే.

నిర్మలావభృధస్నానధర్మమునను
వివిధ లోకంబులెల్లఁ బవిత్రమయ్యె
బలరిపువిభాతి నీరీతి పాండుసూతి
యాచరించిన రాజసూయాధ్వరమున.

293


చ.

సకలధరామరాళికి ప్రసర్పణ దక్షిణతోడ హస్తిఘో
టక శిబికారథంబుల దృఢస్థితి భక్తి నొసంగి, లోకనా
యకుఁ డగు నందనందను గృపాభిరతిన్ వివిధానుభూతియం
దొకటి గొరంతలేకను సహోదరసేవితుఁ డౌచు నుండఁగన్.

294


చ.

మయుఁ డను విశ్వకర్మకులమండనుఁ డాసురకోటికిం జమ
త్క్రియలగు శాంబరీమయనికేతనము ల్విరచించి సర్వది
గ్జయమును బొందనేర్చు జయశాలి యతం డొక దివ్యమౌ సభా
లయ మొనరించి తెచ్చి యకలంకగతిం దనకీయ వేడుకన్.

295


వ.

అది మఱియును-

296


సీ.

సురలోకమునిభాతి సుమనోనిధానంబు
     నబ్ధిసంగతిబాడ బాస్పదంబు