పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 67


ఘృతములు సౌరభాయతసమన్వితములు
     క్షీరముల్ మధురానుసారములును
చిత్రోదనంబు లార్జితమోదనంబులు
     దధులు వజ్రోపలప్రథితనిధులు


తే.

రుచుల చవిగొని మెసఁగఁ గోరుచు లలిం భు
జించి ధర్మజుఁ డటులఁ బూజించి కప్పు
రంపు విడెముల నీయ తోరంపు మహిమఁ
గరము జెలువొందె విప్రనికరము లపుడు.

289


క.

ఆహవనీయప్రముఖ మ
హాహవనాగ్నులు ప్రదక్షిణార్పుల వెలఁగెం
దాహముఁ దీఱఁగఁ గ్రతుపూ
ర్ణాహుతి శ్రుతిమంత్రవిధుల నటు వ్రేల్చుతఱిన్.

290


సీ.

క్రతుమహోత్సవ సమాగత విప్రభోజనా
     హ్వాన రణద్ఫేరిభాంకృతంబు
నఖిలభూసుర దేవతార్చన నైవేద్య
     సమయ ఘంటానాదఝాంకృతంబు
నానాభినయనాట్యగానానురాగ వ
     ర్థిత మృందంగాది దింధీకృతంబుఁ
దాపసపూజావిధానార్ఘ్యపాద్యాది
     కూలంకషాంబు ఘుంఘూకృతంబు


గీ.

నొక్క మొగి దిక్కులను నెక్కి పిక్కటిల్లు
నాద మంతటఁ ద్రిభువనాహ్లాదమైన
భూసతీమణి దృప్తిచేఁ బొగడె ననఁగ
సమధికము జెందుఁ గ్రతుమహోత్సవమునందు.

291


క.

మోదమున లక్షభూసురు
లోదనములఁ దృప్తి నొంద నొకసారి మహా