పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33


మ.

నగరిన్ సౌధశిఖాగ్రకర్షణత మేనం గప్పు నొప్పంగ నా
ఖగజైవాతృకబింబయుగ్మముల రాకన్నె ల్విలోకించి మి
త్రగతి గుంకుమ నింపఁగా నరుణుఁడై రాణించెనేగాక నీ
మృగధారింబలెనే దివాకరునకున్ మేన్కందు బాటిల్లదే.

126


క.

తత్పుటభేదన మాసుర
హృత్పుటభేదనుఁడు జగదధీశుఁడు గుణసం
పత్పటలుం డాఖండల
జిత్పటరథుఁ డేలుచుండు శ్రీకృష్ణుఁ డనన్.

127


క.

ఈ త్రిభువనజనముల కతఁ
డే త్రాతయు నేత యభవుఁ డీశుఁ డనఘుం డా
చిత్రచరిత్రులు దశశత
నేత్రుం డణుమాత్రమైన నేర్చునె తెలియన్.

128


శా.

శ్వేతద్వీపమున న్వికుంఠనగరిన్ శేషాహితల్పంబునన్
చేతఃప్రీతి నజాదులుం గొలువ లక్ష్మీభూమినీళ ల్పదా
బ్జాతద్వంద్వసపర్యఁ జేయ సుఖుఁడౌ సాక్షాత్పరబ్రహ్మ మీ
రీతిం ద్వారకలో వినోదగతి వర్తించెన్ సుఖేచ్ఛారతిన్.

129


మ.

అరిదిం జూడఁగ చిత్రకూటరుచి రామాహ్లాదమౌ నీపురం
బరిదిం జూడఁగ చిత్రకూటరుచిరామాహ్లాదమై యొప్పె నీ
హరినిం జూడఁ చిత్రకూటరుచిరామాహ్లాదుఁడుం గాడె య
వ్వరుసన్ భూజనపాలనక్రియకళావర్ధిష్ణుఁడై రాజిలెన్.

130


సీ.

శ్రీస్తనస్తబకవిన్యస్తకస్తూరికాం
        కస్తుతాస్తోకవక్షస్థలుండు,
తండోపతండసత్కాండజాతభవాండ
        మండితాఖండపిచండిలుండు,