నుపాధ్యాయులు నైన యిద్దఱు బ్రహ్ర్మచారి బ్రావణులు వెంకటప్పయ్య తిరస పతిరాజు ఆనువారు వాసము చేయుచుండిరి. ఈ పని వారి తోడుపాటు చేత్ర జరుగుచున్నదని భావించి యింటిలోనికి పోయి గృహయజమానుఁ డయిన దుగ్గిరాల ప్రకాశరావుగారిని కలిసికొని యా బ్రహ్రచారులను తమయింటి నుండి పంపివేయుటనుగూర్చి మాటాడి యాయనను వెంటఁగొని మరల రావు బ్రవము గారి ooooë38 వచ్చితిని. మే మక్కడనిలుచుండి యుండఁగానే దొడ్డిప్రక్కనుండి గాక వీధి పక్క_నుండి వచ్చియొక రాయి యింటిమినాఁద వడి దాని కప్పునుండి జాణి మేమున్నచోట పడెను. అది యిటుక బొంతీ"గాక నల్లరాతి ముక్కయయి యుండెను. ఆది చిన్న స్వామి గారి మేడమిదినండి వేయఁబడినదనియు త 鐵 ణవుపోయి చూచిన యెడలతమయల్లుఁ డా వేుడమినాఁద కనబడుననియు శంకరవు కేకలు వేసెను. నేను నామిత్రునితోఁగలిసి వెంటనే యా మేడ విూఁదికిపోయిచూడఁగా నక్కడ నా బాలుఁడు కనఁబడలేదుగాని యింటివిూcద పడిన రాతిముక్కల వంటి రాతిముక్క_లు రెండు కనఁబడెను. ఈ రాతిముక్కలేల యక్కడనున్నవని నే నడుగఁగా చిన్నస్వామి గారి పడవల గుమాస్తా బంగారము చితుకకొట్టుటకయి తేఁబడినవని చెప్పెను. అతఁ డిచ్చిన యుత్తరము విశ్వాసారమయినదికా నందున రామబ్రహ్రముగారి యింటి పైని రువ్వుటకేయూ రాళ్లు తేఁబ డె నని నిశ్చయించి, యిట్టి యనుచితకార్యమును చేయించుట మంచిదికా దని చెంతనున్న చిన్నస్వామి గారి రెండవ కుమారుని మందలింపఁగా నతఁడు లక్ష్మీనరసింహముగారి చాcrలివాఁడే పట్టపగలు రాళ్లు చేయుచుండఁగా వాని నేమియు చేయక మమేలనిందించెద రని యడిగెను. ఆందు చేత నీ రాళ్లు వేయుటలో లక్ష్మీనరసింహము గారి సంబంధము తప్పక యున్నదని నిశ్చయించి, ఆయనతో మాటాడుట కయి పోయితిని గాని యాయనగ్రామాం తరము పోయినందున నేను వూ యింటికి పోయితిని, ఇది యంతయు 1889 వ సం|| జూలయి నెల 28 వ తేదిని జరగినది. లక్ష్మీనరసింహముగా రూరి నుండి రాఁగా" a0 వ తేదిని సీనాయన పాఠశాలకు పోయి యాయనప్రాణ మిత్రు లయిన నిడును దుర్గాప్రసాద రాయఁడు గారును సహాయోపాధ్యా