మూ ఁ డ వ ప్రు క ర ణ ము _o 32 రించి వరునిఁ దన వెంటఁ గొనిపోయెను. వీరేశలింగము బెంగుళూరిలో ప్రాయ శ్చిత్తముచేయించుకొని వేంకటరత్నముగారి కొమారితను వివాహమాడెను. ఈ ప్రాయశ్చి త్తవార్త నాకుఁగాని నా భార్యకుఁగాని తెలియదు. వివాహానంతర వున నతఁడు మరల మావద్దకు రాక వేఱుగానుండెను. 1902-వ సంవత్సరము నవంబరు నెల 26-వ తేదిని రాజమహేంద్ర వరములో తణుకు వేంకటచలపతిరావుగారి గృహమునందు భట్టిప్రోలు శరభ య్యగారి వివాహము జరగినది. ఉన్నవ లక్మీ నారాయణపంతులు గారీ సంబంధ వును కుదిర్చి కృష్ణామండలమునుండి రాజమహేంద్రవరమునకువివాహము జరపు నిమిత్తము పంపిరి. పెండ్లికూఁతురు పెండ్లినాటికి యుక్తవయస్సువచ్చినదికాక పోయినను పునస్సంధానము చేయకపోయినయెడల పెండ్లికొడుకు పాణిజోత నని భయపడి చిన్నదానిని మూఁడుదినములు వెలుపలకూర్చుండ ಪಟ್ಟಿ భార్యా భర్తల నొక్కటిగాఁజేసి వెంట సేచెన్నపట్టణమునకు నావద్దకుఁబంపివేసిరి.వధూ వరులును వధువుయొక్క తల్లియు పెదతల్లియుఁగలిసిచెన్నపట్టణమునకురాఁగా, వారికి మాయింటనే కాపురముండుటకు లౌవిచ్చి నాచేతనైన సాయమునుజేసి తిని. వరుఁడు వివాహమునాటికే సర్వకలాశాలా ప్రవేశ పరీకయందుఁ గృతా స్థఁడయ్యెను. వరుఁడు ప్రథమశాత్ర పరీక్షకును వధువింగ్లీషు ప్రాథమిక పరీ క్షకును, చదువుట కేర్పాటుచేసి పాఠశాలలకుఁబంపితిని. ఈవ్యయములన్నియు వధువుతల్లియే భరించుచుండెను. కొన్ని కారణములచేత నీకుటుంబమును మూ యింటఁగాపురముండనిచ్చుట యనుచితముగాఁ గనఁబడినందున మూయింటికిఁ Rగాంచెము దూరములో నదై కొకయిల్లుమాటాడి వీరి నక్కడకుఁబంపి వేసితిని. వరుఁడు ప్రథమశాత్ర పరీకయందుఁ గృతార్థఁడుకాణా పచ్చయప్పగాతి కలాశాలకుఁ బ్రథానాధ్యతుఁడు గానున్న యేట్సు దొరవారికుత్తరము వ్రాసి సగము జీతమిచ్చుపద్ధతి మిద నాతనిని పట్టపరీకతరగతిలోఁ జేర్పించితిని. వీరు మాయిల్లువిడిచి వేఱుచోటనున్నను ప్రతి దినమును వీరితగవులు తీర్పలేక నాకాయాసము కలుగుచువచ్చెను. ఈ -కాలములో దేశిరాజు బాపయ్యగారు.