పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

੩੦੦ & ੬5 こノ § 6 ca $$35 റ്റ 3 తించు ననియు, ఒక వేళ సమ్లంపక పోయినను "నేను వివాహమును జరపెద ననియు, ఈ వివాహ నిశ్చయమునుగూర్చి నే నాయనకు వ్రాసెదననియు, ੇ8 గిరి రావుగారితో చెప్పితిని. ఆయన కొంచెము సేపాలోచించి విూరు తెలు పుటకంటె నేనే తెలుపుట సముచితముగా నుండు ననియు, తాను రాజ మహేంద్రవరము పోయియన్నగారితోఁజెప్పి తా నుత్తరము వ్రాసెదననియు, చెప్పి నన్నుత్తరము వ్రాయవలదని వేఁడెను. నేనందునకు సవ్రుతించి వ్రాయక యూరకుంటిని. ఈ యా క్షేపణ మే లేక యుండిన పకమున వివాహము బహు దినముల క్రిందటనే చెన్నపట్టణములో జరగియుండును. ఇంతలో శేషగిరి"గావుగారికి సెలవు దినము లయిపోవచ్చినవి; ఆయన బొబ్బిలికి §oooo పనిలాగో చేరవలెను. ఆందుచేత శేషగిరిరావు పంతులు గారు నావద్ద సెలవు పుచ్చుకొని, రాజమహేంద్రవరము నుండి యన్నగారితో మాటాడి యుత్తరము వ్రాసెద ననియు, ఉుత్తరమందఁగానే వధువును వెంటబెట్టుకొని వచ్చి వివా హముచేయించి పోవలసిన దనియు, చెప్పిపోయెను. చెప్పినట్టు రాజము హే-ం ద్రవరమునుండి యుత్తరము వ్రాయలేదుగాని, వధువును దీసికొని రావలసినదని యూయన బొబ్బిలినుండి "తంత్రీవార్తను బంపెను. ఆ తంతి సమాచార ముగిదఁ -rer తమ్మఁడన్నగారితో చెప్పి యనుమతి పొందెనని యూహించి, వధువును వెంటఁగొని భార్యా సహితముగా బైలుదేతి యయోమార్గమున రాజమహేం ద్రవరము విూఁదు"గా పోయి విజయనగరమును జేరి తిని. శేషగిరిరావుగా8 భటులు నన్ను విజయనగరములో కలిసికొని, బండ్లమింద గజపతి నగరమునకుఁ గొని పోయిరి. శేషగిరిరావుగా రావఱకే యచ్చటకు వచ్చియుండి వివాహ మునకుఁ గావలసిన సన్నాహముల నన్నిటిఁ జేసియాంచిరి. సే నాయనను చూడఁగానే మొదట వేసిన ప్రశ్న “మియన్నగారు చెప్పఁగానే సవ్రుతిం చిరా? " అని. తా నాయనతో చెప్పలేదనియు, వివాహానంతరమున వ్రాయ వచ్చుననియు, చెప్పినప్పడు నా మనసునకు కలిగిన విచార మింతంతయని చెప్ప నలవికాదు. ఆంతదూరము వచ్చిన తరువాత వివాహము జరపకుండ పోవుట యాచితము కాదని తలఁచి 1900-వ సంవత్సరము ఫిబ్రవరి నెల 26.వ