5 OO o Ο స్వి య చ రి త, ము పనికొఱకే యెప్పుడు నుండవలయు ననియు, నే ను త్తరము వ్రాసితిని. ఆ మందిరముయొక్క క్రిందిభాగములో దక్షిణహిందూస్థాన బ్రహ్మసమాజమవారు తమ రాత్రిపాఠశాల నుంచుకొని నెలకు నాలుగు రూపాయ లదైయిచ్చుచుండిరి. వా రా యిల్లు రు 850 లకు తమకే విక్రయించునట్లు చేయవలసిన దని నాకు [వాసిరి. ఆ యింటి నెప్పుడును కాఁపురముకొఱ కమివేయకుండునట్లును, జనో పయోగకరములైన పనులకే యుపయోగించుచుండునట్లును, నేను చెన్నపట్ట ణము వెళ్లినప్పుడు నన్నక్కడనుండ నిచ్చునట్లును, వా రొప్పుకొన్నవిూఁదట సంస్కరణ సమాజమువారిచేత బ్రహ్మసమాజమున కాయింటిని రు 650.0.0 లకు ఆమ్రించి సౌమిప్పించితిని. ఈ క్రయ ధనమును మహారాజా గజపతిరావుగారి ధర్మపత్ని బ్రహ్రసమాజము వారి కిచ్చెను. సంఘ సంస్కరణ సమాజము వారు నా కప్పటి కియ్యవలసియుండిన యిన్నూఱు రూపాయలును నేను క్రయధన ములాగనుండి తీసికొని వంటయింటిని మఱుఁగుదొడ్డిని నీటిగొట్టమును సము కూర్చుట కయి బ్రహ్మసమాజము వారి కిచ్చివేసితిని. ఆ యిల్లు తమ కిప్పించిన యెడల వేయి రూపాయలును అంతకంటె నెక్కువయు నిచ్చెదమని కొం దఱు గృహస్థులు నాయొద్దకు వచ్చిరి కాని కాపురములుండుట కయి నే నిప్పింప నని వారితోఁ జెప్పి పంపివేసితిని. నేను వితంతు శరణాలయమును చెన్నపట్టణములో స్థాపించి వూ యింటనే జరపుచుంటిని. ఇద్దఱో ముగ్గురో నలుగులో వింతంతువు లెప్పు డును మా యింటనుండుచునే వచ్చిరి. నేను వారిని విద్యనిమిత్త ముపాధ్యా యినుల బోధనాభ్యసన పాఠశాలకుఁబంపి జీతము లిచ్చి చదువు చెప్పించుచు, వారికన్న వస్తాదులను పు స్తకములను ఇచ్చుచు, వ్యాధిసమయములయందు వైద్యము చేయించుచు, వితంతు శరణాలయమును నడుపుచువచ్చితిని. ఈ fరణాలయమును రాజధానియైన ద్రావిడ దేశమునం దుంచినను, అందు చేరిన వారిలాశ నిరువురు తప్ప తక్కిన వారందఱును తెలుఁగు దేశమునుండి వచ్చిన చాశ యంుయుండిరి. ఆ యిరువురిలో నొక్క-తె మాత్రమే యజ9వబాల వితంతువు; రెండవ యూమె తిరునల్వెల్లినుండి తండ్రిచేత తీసికొని రాఁ