పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

349



చునేవచ్చు చున్నట్టును రామకృష్ణయ్యగారిమరణానంతరమున వివాహములు జరపునిమిత్తముగాని పురోహితునియొక్కయు వంటబ్రాహ్మణునియొక్కయు జీతమినిమిత్తముగాని యేమియుసాయముచేయకున్నట్టును కనుఁగొనుటకు చింతిల్లుచున్నారు.)

"5. That Mr. A. L. Narasimham Chettiar be addressed on the subject for the last time and further action in the matter be left to the decision of the managing committee." (ఈవిషయమయి కడపటిసారి లక్ష్మీనరసింహముగారికి వ్రాసి, యీవిషయములో ముందుజరిగింపవలసినచర్య కార్యనిర్వాహక సంఘమువారి నిర్ణయమునకు విడిచిపెట్టఁబడుచున్నది.)

ఈకడపటి నిర్ధారణప్రకారముగా కార్యనిర్వాహక సంఘమువారు న్యాయసభలకుఁబోయి యేదోయొకవిధముగా వ్యవహారనిర్ణయమును పొంది యుందురుగాని ధనాభావముచేత నట్టిపనిజరగలేదు. సమాజముదుర్బలస్థితి యందుండుటను గనిపెట్టి లక్ష్మీనరసింహముగారు స్వతంత్రించియానిధిని దొరతనమువారి పత్రములనుండి తొలఁగించి, ముందుగా వాణిజ్యధనాగారమునఁ (Commercial Bank) బెట్టి, తరువాత నాధనమునక్కడనుండి తీసిదానితో చిత్తుర్రుమండలము నందొకగ్రామమునుగొని, 'రాజా' యనుబిరుదు నామముతో తన్నుఁబిలుచుకొనుచు తనమరణపర్యంతమును పదికుటుంబములకు సంవత్సరమునకు మున్నూఱు రూపాయలు పంపుచుండిరి. ప్రథమవివాహముచేసికొన్న గోగులపాటి శ్రీరాములుగారికి మొదటినుండియు భాగమునియ్యమాని వేసిరి. పులవర్తి శేషయ్యగారు కాలముచేసినతరువాత నాతనివంతియ్యమానివేసిరి. శేషయ్యగారికుమారుని నేను చేరఁదీసి విద్యచెప్పించి పెంచుచుండుటను బట్టి యతనిభాగమియ్యనక్కఱలేకపోయినది. ఒకవేళ లక్ష్మీనరసింహముగారాచిన్న వానిభాగమని నెలకు రు. 2-8-0 లు పంపుచుండియుందురనుకొన్నను, అంత చిన్న మొత్తముతో నెవ్వరాయేడేండ్ల శిశువునకన్న వస్త్రములిచ్చి పెంచి విద్య