350
స్వీయ చరిత్రము.
చెప్పింపఁబూనుకొందురు? మరణకాలమునందు తాముసదుద్దేశముతో నిచ్చిన పదివేలరూపాయల ధనము వివాహకార్యములకుఁగాని తల్లిదండ్రులను గోలుపోయి యగతికులయిన శిశువుల పోషణమునకుఁగాని యుపయోగపడక గడించు భర్తను పోగొట్టుకొని దుఃఖపడు రాచర్ల రత్తమ్మకువలెనే రాజమహేంద్ర వర పురపారిశుద్ధ్యవిచారణసంఘ కార్యనిర్వాహకకుండయి నెలకు నలువది రూపాయలుగడించు, నల్లగొండ కోదండరామయ్య గారికిని నెలకు నెలకు రు. 2-8-0 ల చొప్పున భరణముక్రింద నుపయోగపడునని రామకృష్ణయ్యగారు స్వప్నావస్థయందైనను దలఁచియుందురా? వివాహములకయి కాసయిన నియ్యకవచ్చిన వడ్డినంతను దురాశచే తామే యనుభవింపవలెననుకొన్న పుణ్య పురుషులకా రు 2-8-0 లచొప్పున ననుభవించు భాగ్యము సహితము చిరకాలముండినది కాదు. లక్ష్మీనరసింహముగారి లోకాంతరగతితోనే వడ్డిమాత్రమేకాక యానిధియంతయు సమూలముగా నంతరించి, యీనడుమను నష్టమయిన రెండు కుటుంబముల యంశములనుగూడ పాళ్లువేసి పంచుకొను శ్రమకూడ వారికి తప్పిపోయినది.
ఇఁక మన సమాజవృత్తాంతమునకు వత్తము. 1886, 1887 సంవత్సరములలో సమాజము వారొక్క వివాహమునైనను చేయఁగలిగినవారుకారు. 1887 వ సంవత్సరాంతమున కార్యనిర్వాహక సంఘమువారి కార్యదర్శి శ్రీ న్యాపతి సుబ్బారావుపంతులుగారు తమ కార్యనివేదన పత్రికలోని యాదాయ వ్యయపట్టికలోఁ జూపిన ప్రకారముగా నేను తిరిగి పోగుచేసికొని వచ్చిన రు 742-12-4 లును, సమాజమువారు నెల చందాలమూలమునను దాన ధన రూపమునను పోగుచేసిన రు. 1585-4-0 లును, (మొత్తము 2328-0-4) నెల జీతములక్రిందను వివాహ దంపతులకిచ్చిన ధనదానములక్రిందను (1888 సం|| 1 వ జనేవరున నిలువయుండిన రు. 212-13-4 లుగాక) వ్యయపడినవి. రామకృష్ణయ్యగారు మరణము నొందునప్పటి కాయన మరణశాసననాను సారముగా నిద్దఱిద్దఱికి పంచిపెట్టవలసినవి రాజమహేంద్రవరములో రెండిండ్లుండినవి