నాల్గవ ప్రకరణము.
337
ములు చేసికొన్నవారు వెనుకటివారికున్న సదుపాయములు తమకు కావలెనని కోరరా? మీకు మాత్రము లేవనెడుపక్షమున, కష్టములకోర్చి సాయమేమియు లేకుండ వారు మనపక్ష మవలంబింతు రని యెట్లు ప్రతీక్షింపవచ్చును ? ముందు పెండ్లిచేసికొన్నను వెనుక పెండ్లి చేసికొన్నను తమ శక్తిలో నున్నంత వఱకు సమాజము వారందఱికిని కష్టసమయమునందు సాయము చేయవలెను. ఈ పక్షముయొక్క క్షేమమునుగోరువారు దీని పురోవృద్ధిని చూడవలెనుగాని యిప్పటి సంఖ్యనుమాత్రమే చూడఁగూడదు. ఇప్పుడున్న వారొకరి తరువాత నొకరుగా నశించి పోవచ్చును. కాఁబట్టి మనమీ యుద్యమము జీవించునట్లు చేయవలెనుగాని చచ్చిపోవునట్లు చేయఁగూడదు.
సొమ్ము నొక్కరికంటె నెక్కువమంది పేరిట సురక్షితమైన ధనాగారములోనుంచి, వచ్చినవడ్డి నాఱు నెలలకో సంవత్సరమునకో యొక్క పర్యాయమసలులో చేర్చుచు, ఆవశ్యకమయినప్పుడు నిజముగా రిక్తస్థితిలో నున్న వారికి మాత్రము వడ్డిలోనుండి కావలసిన సాయముచేయుచు, ఈవ్యయములు పోఁగా వడ్డిలో మిగిలినదానితో వివాహములు జరుపుచుండ వలెనని నాయభిప్రాయము.
రామకృష్ణయ్యగారి యభిమతాను సారమని మీరు చెప్పెడు ప్రకారముగా వడ్డిని పంచి పెట్టుటవలన వివాహములు చేసికొన్న వారిలో సోమరి తనము పెంపుచేయఁబడును. వారు స్వకాయకష్టమును నమ్ముకొనియుండవలెను. స్వయంకృషిచేసినను శక్తులు కానప్పుడు మాత్రమే వారికి సాయముచేయ వలెను. స్వప్రయోజన పరత్వమును మాత్సర్యమున, సంతోషపూర్వకముగా మనస్సులనుండి పాఱఁదోలి, దయచేసి యీ యుద్యమమును వెనుకటి సచ్చింతతోనే ముందు నడిపింపుఁడు.'
ఈయనకును తరువాత యచ్చటి మా పెండ్లికొడుకులకును గల తారతమ్యము పైదానివలన తేట పడవచ్చును. తగిన యుద్యోగములలో నున్న కోదండరామయ్యగారు శేషయ్యగారు మొదలైనవారీ నూతనపథక మేర్ప