పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

329



దులో చేర్చుకొని, "వితంతు వివాహములను జరుపు నిమిత్త" మని వ్రాసినకథనే బొత్తిగా నెత్తుకోక, ఈవఱకు వివాహములుచేసికొన్నవారి పోషణమునకును చిల్లర వ్యయములకును మాత్రమే వడ్డీని ముఖ్యముగా వ్యయము చేయవలసినదని తనతో రామకృష్ణయ్యగారు రహస్యముగాచెప్పిరన్న నవసృష్టి నొకదానిని బైలుదేఱఁదీసి, వారిచేత కొన్ని నిర్ధారణములు చేయించి, వానిని 5 వ అక్టోబరు తేదిగల తమ ప్రకటన పత్రములో నితర స్థలములయందుండిన వరులకు తరువాతఁ బంపిరి. ఈకూటమిలో నాకు ప్రతిపక్షులయిన కోదండరామయ్యగారును పులవర్తి శేషయ్యగారును చేరుట వింతకాదుగదా! లక్ష్మీనరసింహముగారి చేతిక్రింద పనిలో నుండిన వారగుటచే రాచర్ల రామచంద్రరావుగారును తణుకు వెంకటచలపతిరావుగారును తప్పక చేరవలసినవారే. బీదలగుటచే ధనాశచేత చేబోలు వెంకయ్యగారును పటానేని వెంకయ్యగారును చేరిరి. ఒక్క మంజులూరి గోపాలకృష్ణయ్యగా రందు చేరకపోయిరికాని దానికి కారణము రామకృష్ణయ్యగా రాఱు రూపాయలిచ్చుచుండఁగా నది తగ్గిపోవుననియే, కాని పారమార్థిక చింతకాదు. ఈకాగితములను మొదటి వివాహమాడిన గోగులపాటి శ్రీరాములుగారికి పంపినప్పు డాయన వ్రాసిన యుత్తరముతోడఁ గూడ నిందు ప్రకటించుచున్నాను.

NOTICE.

To

THE ex-officio members of the Widow Marriage

Association Rajahmundry.

Late Mr. Pyda Ramakrishniah at the time of his death appointing me as Trustee for Rs. 10,000 which he left at the time for the benefit of the people married under the auspices of Widow Marriage Association at Rajahmundry clearly expressed in his words to me the interest alone of the said sum should be spent primarily for the support and con