పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

217



యుండుటచేతను, అక్కడకుపోయిన మామనుష్యుల తెలివి తక్కువచేతను; ఆయేర్పాటులేవియు సరిగా జరగక వ్యయప్రయాసములకులోనయి మావారు పోయినదారినే వట్టిచేతులతో మరలి రావలసినవారయిరి. నాయుత్తరమునకు బదులుగా మనోహరము పంతులుగా రిట్లువ్రాసిరి.

"My dear friend,

మీరువ్రాయించినవుత్తరం అంది అందులసంగతులు విశదపర్చుకున్నాను. యీసారి అయినా మనముతలుచుకున్న కార్యంసఫలంకానందుకు మిక్కిలి విచారించుచున్నాను. యీకాకపోవుట ముఖ్యముగా మీరుపంపిన మనుష్యుల తెలివితక్కువ నడవడికచేతనే అయినట్టు నేను స్పష్టముగా చెప్పగలను. వాళ్ళనడవడిక మీనోటీసులోకి తీస్కునిరావడపు వుద్దేశ్యమేమనఁగా యిటు మీదట యెప్పటికీ యిట్టివాళ్ళను వుపయోగపర్చకుందురని తలస్తాను. రాత్రి 10 గంటలవరకు కోదండ్రామయ్య వగైరాలను మాయింట్లోవుంచుకుని పిమ్మట సవారీ బోయీలను వూరిబైట సిద్ధంగావుంచి ఒకరుమాత్రం చిన్న దాని అరుగుమీద పరుండవలసినదనిన్నీ ఒకరాత్రివేళ ఆచిన్న దేవచ్చి లేపుతున్న దనిన్నీ చెప్పివున్నందుకు ఆప్రకారంచేయక యిద్దరు మనుష్యులు వాళ్ళగుమ్మంవద్దకు వెళ్ళి వాళ్ళగుమ్మంయెదట యిటూ అటూ టలాయిస్తూ తలుపుకొట్టినారు. యెక్కడినుంచో తమరు తీసుకునివచ్చిన రెండువుత్తరాలు వాళ్ళగుమ్మంలో పారవేశినారు. యీసంగతులు అన్నీ ఆగుమ్మం యెదుటవున్న వెంకటనరసన్న వగైరాలుచూచి యెవళ్ళో యీలాగునచేసినట్టు నాతో చెప్పినారు. అందుపై వాళ్ళు మేలుకుని వెలుపలికివచ్చి వీళ్ళ వెంట మనుష్యులను పంపినారు. అదివరకే అనగా ఆదివారంనాటికే మనవుద్దేశం కాకినాడలో తెలిశినది. ఒకదుర్మార్గుడు ఆదివారం రాత్రి మేము చిన్న దాన్ని రాజమంద్రి తీస్కుని వెళ్ళుతాము జాగ్రత్తగా వుండవలసినదని చిన్నదాని తండ్రిపేర వుత్తరంవ్రాసినారు. ఆలాగున వ్రాశినా చిన్నది యేలాగునైనా ఒక రాత్రివేళ వస్తాననిన్నీ ఒకమనిషిమాత్రం అరుగుమీద పరుండ పెట్టవలసిందనిన్నీ చెప్పి