పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

స్వీయ చరిత్రము.



నది. ఆప్రకారంజరగలేదు. కాకినాడనుంచి వచ్చినవుత్తరంలో వున్నప్రకారం మనుష్యులు వచ్చినందున యింటివాళ్ళు తెల్లవార్లు నిద్రపోలేదు. పైగా ఆ రాత్రి యిక్కడికివచ్చినబంట్రోతులు తాగివున్నట్టు కనపడుతున్నది. ఈ పైన వ్రాసిన సంగతులకు నిదర్శనంగా చిన్నదివ్రాసిన వుత్తరాలు జతపర్చినాను. యేలాగుననైతే నేమి యీపని మేముచేయించినట్టు యింటివాళ్ళు అనుకోకుండా వాళ్ళకు విరోధిగా వున్నటువంటిన్నీ కాకినాడనుంచి వుత్తరం వ్రాసినటువంటిన్నీ మనుష్యుడు తనవుత్తరపుసంగతులు నిజంగావున్నట్టు యేర్పడేనిమిత్తం ఆదివారంనాటిరాత్రి యెవరో మనుష్యులచేత అల్లరిచేయించినట్టు అనుకునేలాగున చేయడమైనది. మేముమాత్రము యవరివల్లనున్ను యిదివర్కు అనుమానింపబడలేదు. చిన్న దానికి మాకువుత్తరప్రత్యుత్తరములు జరుగుతూ వున్నవి. చీకటిరాత్రిళ్ళుగాచుచ్చి ఒక మాసంరోజులు పోయినపిమ్మట ముహూర్తం యేర్పర్చి ఒకమనిషిని మీరు నాయొద్దకు పంపినయెడల చిన్న దాన్ని పంపగలనని తోచుచున్నది. నాకు వీలైనప్పుడు పంపినపక్షమున ముహూర్తంకుదిరేవరకూ చిన్న దాన్ని దాచగలరా ? ఒకవేళ పట్టుపడినయెడల యుక్తమయిన వయస్సు వచ్చినట్టు స్థిరపరచ గలుగుదురా ? వ్రాయించవలెను. కోదండ్రామయ్య వగైరాలను చివాట్లు పెట్టకోరుతాను. ఆచిన్న దానికి యివ్వవలసిన వుత్తరములు యేమైనా వున్న యెడల ఆసంగతి నాతో చెపిత నేను Medium ద్వారా అందచేతును. వీళ్ళు గుమ్మంలో పారవేశినవుత్తరములు చిన్నదానికి చిక్కినవి. ఆవుత్తరములు 1-2 రోజులలోనే సంగ్రహించి తమ తావుకు పంపించుచున్నాను. యీచిన్నదిగాక 4 గురు చిన్న వాళ్ళువున్నారు. వాళ్ళుకూడా నింపాదిమీద సందర్భించగలరని తోచుచున్నది..............."

ఈప్రయాణమునకు లక్ష్మీనరసింహముగారి పరిజనుఁడు పట్టాభి రామస్వామిగారిచ్చిన యీక్రింది లెక్కప్రకారము ముప్పదిమూడు రూపాయల ఆఱణాలయినవి.


జనం 1 కి రు. 1-12-0ల చొ|| 13 బోయీలకు రు. 22-12-0