పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

స్వీయ చరిత్రము.



మాతో భోజనములుచేసి యేవిధమున తోడుపడుదురో తెలిసికొనుటకయి పత్రికలలో ప్రకటనలు ప్రచురింపఁగా పేరుగలవా రిరువదిముప్పదిమంది భోజనములు చేయుటకు సంసిద్ధులయియున్న ట్టుత్తరములు వ్రాసిరి. హిందూ పత్రికలో ప్రతిదినము మూడునాలుగేసి యుత్తరములు ప్రకటింపఁబడుచు వచ్చినవి. ప్రకటింపఁబడిన యుత్తరములలో నధిక సంఖ్యవి యంతగా ప్రోత్సాహకరములుగా నుండకపోయినను, ప్రోత్సాహకరములుగానున్న వే యప్పటి మా పనికి చాలియుండునట్లు కనఁబడెను. మాతో సహభోజనమున కేర్పాటుచేసి మాకు ప్రోత్సాహముకలిగించుటకయి చెంచలరావు పంతులుగారు మమ్మచ్చటకురండని యాహ్వానముచేసిరి. నేనాయాహ్వానము నంగీకరించి యీస్టరు సెలవులలో కుటుంబసహితముగా నచటికిఁబోవ నిశ్చయించి నాయభిప్రాయమును వారికిఁదెలిపితిని. తమయుత్తరమును జూచువఱకును బైలుదేఱవలదని తంతిసమాచారమును బంపి 12 వ మార్చి తేదిని మైలాపురమునుండి వారు నాకిట్లు వ్రాసిరి -

"నా ప్రియమిత్రుఁడా !

మీయుత్తరమునకు ప్రత్యుత్తరమైన నాతంత్రీవార్త మీకాశాభంగము కలిగింపదని నమ్ముచున్నాను. మనము పూనినపక్షమునందు గొప్పయాదరము పూనుచున్నట్టు మీరెఱిఁగిన రఘునాధరావు వారిసహాయ్యమునుగోరుచు తన మిత్రులకందఱికిని విజ్ఞాపనమును బంపియున్నాఁడు కార్యములలో మనము తొందరపడినపక్షమున ఎవరిసాయము మనకుముఖ్యమో యటువంటి యనేకుల యొక్క సాహాయ్యమును మనము పోఁగొట్టుకోవచ్చునని ఆయన తలఁచు చున్నాఁడు. అందుచేత నాతఁడు వచ్చెడు ఏప్రిల్ 30 వ తేది వఱకును మీ ప్రయాణము నిలుపవలసినట్టు మిమ్ము ప్రార్థింపుమని నన్ను కోరెను. మావర్తమానము నన్యధాగ్రహించి, మీకు సహాయముచేయుటకు మేముచేసిన వాగ్దానమును కొంతవఱకు మరలించుకొంటగా మీరు భావింపరని నేను నమ్ముచున్నాను. అయినను మీరు వెంటనేరావలెనని నిశ్చయించుకొన్న పక్షమున