పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

199



న్యాయవాదిగానుండి మొట్టమొదట మాలోఁజేరియుండినను ఇప్పుడు స్త్రీ పునర్వివాహ నిషేధవాదులకు నాయకుఁడుగానుండిన యొక ప్రబల గృహస్థా సమయమున చల్ల గాలికై నేను కూరుచుండినతావున కనతిదూరముననే గోదావరియొడ్డున కూరుచుండియుండి యెవ్వరోవచ్చి యాశిష్యులవార్తను చెవిలో చెప్పఁగానే యధైర్యముపుట్టి తనసేవకునిచేతిలోని దీపమునారిపించి తలనిండ ముసుఁగువేసికొని రాజమార్గముననడువక ప్రాణము లఱచేతిలో పెట్టుకొని సందులగుండపోయి యిల్లుచేరి తిరిగిచూచెను. అటువంటిస్థితిలో స్వాముల వారికి ముఖ్యబలముగానున్న వారొక్కరును వారినూరార్చుటకయిన ఆరాత్రి పీఠదర్శనమునకురాక, తత్క్షణ మూరువిడిచిపొండని దూరమునుండి లోక గురువులకు సందేశమును బంపిరి. వారియాలోచనప్రకారముగా మఱునాటి యుదయమున విద్యార్థులు తమ విద్యాశాలనుండి రాకమునుపే స్వాములవారు తమ పీఠమును మాపట్టణమునుండి తరలించి పొగయోడకుకట్టిన పడవలో శిష్యబృందముతో తాము నదినితరించి భిక్షలుచేయింపలేక శ్రమపడుచున్న మాపురమువారినికూడ తరింపఁజేసిరి. స్వాములవారు మాపురములో నట్టేయుండిన యెడల విద్యార్థులు వారిపీఠమును గొనిపోయి గోదావరిలో పడవేసెదరనికూడ నొకప్రవాదము పుట్టెను. మొట్టమొదట దెబ్బలుపడిన విద్యార్థి స్వాములవారి శిష్యులమీఁదను, స్వాములవారి శిష్యులు విద్యార్థులమీఁదను ధర్మసభలలో నభియోగములు తెచ్చిరికాని దండవిధాయకుఁడు జహద్గురుల శిష్యుల కై దేసిరూపాయలు ధనదండనము విధించి ఋజువులేనందున విద్యార్థులను విడిచిపెట్టెను. స్వాములవారికి సంభవించిన యీవిపత్తువలన మా ప్రతిపక్షులకు కొంతగర్వభంగము కాఁగా కొంతకాలము వారు మమ్మధికముగా బాధింపకుండిరి.

ఇక్కడమేము మాపాట్లుపడుచుండఁగా చెన్న పట్టణములోని మా స్నేహితులూరకుండినవారుకారు. శ్రీపల్లె చెంచలరావుపంతులుగారును దివాన్ బహదూర్ రఘునాధరావుగారును మాపక్షమునుబలపఱుపవలెనని యెవ్వరెవ్వరు