పుట:Sukavi-Manoranjanamu.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


'తురగాన్ కరిణోధవా'

అనుచోట క్రమభ్రష్ట మను దోషమన్నారు. రెండును పతత్ ప్రకర్షదోషమనే చెప్పవలెను. (రెంటికిని) భేదము లేశమును కనిపించదు. మరి పతత్ పకర్షము దోషమే అయితే

'న బ్రహ్మ విష్ణువచసామపి గోచరస్త్వ
మస్మద్విధస్య కిమహో తదవైమి సర్వమ్ '

అను మల్హణకవి పద్య మేమగునో మరియు అతని పద్యమే యగు

‘బ్రహ్మేంద్రవిష్ణుసురదానవలోకపాలైః'

అన్నదేమగునో! ఇంకను గలవు.570

దండిగారి అనామయము

వేధావిష్ణుర్వరుణధనదౌ వాసవో జీవితేశ
శ్చంద్రాదిత్యా వసన ఇతియా దేవతాభిన్న కక్ష్యాః
మన్యే తాసామపి న భజతే భారతీ తే స్వరూపం
స్థూలే త్వంశే స్పృశతి సదృశం తత్పున ర్మాదృకోపి.

571
సుభాషితరత్నావలి

శంభుస్స్వయంభు హరయో హరిణేక్షణానాం
యేనాక్రియంత నుతతం గృహకుంభదాసాః
వాచామగోచర చరిత్ర పవిత్రితాయ
తస్మై నమో భగవతే మదనధ్వజాయ.

572

ఇందు పాదాంతలఘువులు గురువులు, 'స్వయంభు' హ్రస్వాంతము, గమనించవలెను.573

'భద్రాసనాని దృషదః భద్రాణి చ మహీరుహాః
దుర్దశా రాజ్యమూర్థాభిషిక్తాః పున రహో వయః'

అనుచోట 'సంబంధ వివర్జిత' మను దోషమన్నారు. సరే, భిన్నలింగ వచన దోషములకు