పుట:Sukavi-Manoranjanamu.pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'లంజె'
కవికర్ణరసాయనము (4-110)
సీ. గీ.

లంజెతల్లు లనఁగ లక్షింపగా నిట్టి
కట్టడులను నలువ కరుణలేక
భ్రాతిమాలినట్టి బతుకులు నిడుపుగాఁ
జేసి విటుల గోడు వోసుకొనియె.

398
'గద్దె'
శ్రీనాథుని కాశీఖండము (4-195)
సీ. గీ.

చంద్రికాపాండుకౌశేయశాటియైన
యతను జగజంపుగొడు గెవ్వఁ డవ్విభుండు
పెద్దకాలంబు ముత్యాలగద్దె యెక్కి
వసుధ పాలించు నేకోష్ణవారణముగ.

399
'ఒల్లె'
కృష్ణరాయల ఆముక్తమాల్యద (2-81)
సీ. గీ.

నారికేలాసనపుఁ దీపు టూరుపొలయ
వలిపె యొంటెల్లెతో నురఃస్థలులఁ గూడు
ప్రియులఁ దేకువతో నెచ్చరించి కలసి
రెలమి ధన్యులు పరపు వెన్నెల బయళ్ల.

400

అహోబల పండితులవారు నూత్నదండిగారి మతము నిర్మూలమన్నారు. ఇటువలెనే అందె-అందియ; పట్టె, మట్టె, మిద్దె, ఈటె, పల్లె, కన్నె- ఈ మొదలైనవి రెండును గలవు. ముత్తెము - ముత్తియ మనిన్ని గలదు. మల్లెలు- మొల్లలు- అని పదభేదమే కాదు, అర్థభేదము గలదని తోచుచున్నది.401

యయాతిచరిత్ర (1-36)
గీ.

అగరు లేలకి విరవాది యాకు తీగెఁ
మల్లియలు గొజ్జెగలు దాక మొల్ల మొగలి