పుట:Sukavi-Manoranjanamu.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాయము నాకుమారునకు నర్మిలి హత్తగ నత్త వావిచే
నాయువు గల్గువాఁ డవునటండ్రు శుభంబగు దీన నెంతయున్)

348

'వేసె-ఏసి' భాస్కర రామాయణ పద్యము శసలకు ప్రాసమందు (ప్రథమాశ్వాసమున) వ్రాసినాము.349

వేచుట-ఏపుట
శాంతిపర్వము (3-20)
చ.

విను మరి జంపనుం జెఱప వేచుట లెస్స ప్రతాపభాషణం
బున (వెడనుల్లికుట్టులను బొంకుల వానిఁ గలంగఁ జేసిరేఁ
చినఁ దనపూవు దప్పు నఱసేయని చందము నమ్మియున్న చా
డ్పును మెఱయంగఁ బల్కుచుఁ గడున్ మది నమ్మకయుండుఁగా దగన్)

350
సౌప్తికపర్వము (1-66)
గీ.

అలుక బొడమువాని కర్ణచింతకునకు
నాతురునకు మన్మథార్తునకును
నిద్రవచ్చునెట్లు నీవును దీనిని
నెఱిఁగి యుండి యేటి కేప నన్ను.

351
'వేర్పడు'
శాంతిపర్వము (3-228)
గీ.

మేలుచేసి తగిన మిత్రులఁ బడసి త
త్సుచరితముల వచ్చు సుఖము లనుభ
వింపఁ జూచు టుడిగి వేర్పడియుండుట
యరయ నీతివిదుల తెరవుగాదు.

352

అచ్చు (ఏర్పడు) కు కాకుస్వరములందు (లక్ష్య) మున్నది, 'ఎడబాపుట'సులభము.353

'పెడబాపు'
చేమకూరవారి విజయవిలాసము (3-119)
క.

వడిఁ దెఱవల్ తెర వంపం
బడుతుక నగుమోము గానబడియెన్ గాంతుల్
దడఁబడఁగ శరన్మేఘము
బెడపాసి వెలుంగు చంద్రబింబము వోలెన్.

354