పుట:Sukavi-Manoranjanamu.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


'ప్రబోధమాధాయ మశాబ్దికానాం
కృపా మవాప్తుం చ సతాం కవీనామ్
ద్విరూపకోశో రచితో విచార్య
బహుప్రబంధస్థితశబ్దభేదాన్.'

అని చెప్పుటవలన శ్రీ హర్షులవారును పూర్వకవి ప్రయోగములను చూచి రచించినాము గాన సందేహ మొందవలదని నిశ్చయముకొఱకు చెప్పినట్లు స్పష్టముగా నున్నది.
ఆ ద్విరూపకోశమందు—

'స్వర్ణదీ స్వర్ణది శ్చాపి, వల్లీ వల్లిశ్చ కీర్తితా
దాడిమీ దాడిమిశ్చ స్యాత్, మహిశ్చాపి మహీ తథా
రజనీ రజనిశ్చ స్యాత్ లక్ష్మీ ర్లక్ష్మి ర్హరిప్రియా
వలభీ వలభిశ్చ స్యాత్ నాభీ నాభిశ్చ కథ్యతే
శాల్మలీ శాల్మలి శ్చాపి, యువతీ యువతి స్సమే'

ఇటువలె ననేక శబ్దములు ఈకారాంతములు, ఇకారాంతములును రూఢిగానున్నవి.111
అధర్వణాచార్యుల వారికి పూర్వులైన మహాకవుల ప్రయోగములు— 112
భోజ చంపు (బాల. 25)

నారాయణాయ నలినాయత లోచనాయ
నామావశేషిత మహాబలి వైభవాయ
నానా చరాచర విధాయక జన్మదేశ
నాభీపుటాయ పురషాయ నమః పరస్మై.

113
శంకరాచార్యులవారి రచన

నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగా మోహావేశమ్
ఏత న్మాంస వసాది వికారం
మనసి విచింతయ వారం వారమ్.

114
పై శ్లోకములలో 'నాభి' ఈకారాంతము.115