పుట:Sukavi-Manoranjanamu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దశమస్కంధము ఉ. భా (476)
క.

ఎఱుగమి నైనను భూసుర
వరుల ధనం బపహరింప వలువదు పతికిన్
మఱుపున ననలము ముట్టిన
దరికొని వెసఁ గాల్పకున్నె తను వెరియంగన్.

157
తృతీయస్కంధము (54)
క.

హరిపదసేవకుఁ డరిభీ
కరుఁ డర్జును వలన మిగుల కార్మికవిద్యల్
గఱచిన బలియుఁడు సాత్యకి
వఱలిన సుఖలీల నున్నవాఁడె ధరిత్రిన్.

158
చతుర్ధస్కంధము (38)
చ.

సరసిజగర్భ యోగిజన సర్వసుపర్వ మునీంద్ర హవ్య భు
క్పరమ ఋషి ప్రజాపతులు భక్తిమెయిం జనుదెంచి యుండున
త్తఱి తరుణార్కతేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సభాసదుల్
తరమిడి లేచి రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.

159
ఇక బొప్పరాజు గంగరాజు కవిత్వము
పంచమస్కంధము (1-9)
క.

హరి నా ముఖమున నీకున్
నెఱిఁగింపఁదలంచి నాకు నెఱిఁగించెను సు
స్థిరమతి వినుమంతయు శ్రీ
హరి వాక్యముగాఁ దలంచి యవనీనాథా!

160
అని వ్రాసినారు.
కావున పోతరాజుగారి భాగవతము అన్నివిధముల సర్వోత్కృష్టమైనది.
(ఇక ఇతర కవుల కవిత్వములందు) రేఫ ఱకార సాంకర్యము కలుగుటకు తిమ్మకవిగారు 'లక్ష్మణసారసంగ్రహము' (3-319) నందు—
క.

అలసాని పెద్దకవి పిం
గళి సూరన రామభద్ర కవివర్యుఁడు పి