పుట:Sukavi-Manoranjanamu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రెండవ చరణమందు వ్యంగ్యకాకుస్వరయతి (యు నున్నది.) 289
ఉభయముకు
పారిజాతాపహరణము (5-86)
సీ.

మేలవించినవి సుమ్మీ దీని మెట్లని
             మాంసలాంసంబున మహతిఁ జేర్చి
మిన్నేటిజలము సుమ్మీ తొలఁకెడునని
             డాచేత మణికమండలు వొసంగి
యిది జపోచితము సుమ్మీ జతనంబని
             వలచేతఁ బద్మాక్షవలయ మిచ్చి
యీశానుఁ డిచ్చె సుమ్మీ మాకు నిది యని
             శార్దూలచర్మంబుఁ జంకఁ జొనిపి
పొమ్ము పొమ్మని యొకకొంత పోవఁబనిచి
రమ్ము రమ్మని యొకకొంత రాగఁ బిలిచి
కపటనటనాపరుండైన కంసవైరి
బరమముని నవ్వుటాలకుఁ బనులు గొనియె.

290
అందే (2-28)
చ.

అదితి మొఱంగి కుండలము లానరకుండు హరించె వాని నే
కదనములోన ద్రంచి యవి గైకొని దాచితి నాటనుండియుం
బదిలముగాఁగ నన్నడుగఁ బంపని కారణమేమి లాతినే
యిదె చనుదెంచి యిత్తుననుమీ శతమన్యునితోడ సంయమీ.

291
లాక్షణికులు సంశయప్లుతమందు 'అనుమీ' అనునది వ్రాసినారు. సంశయ మెక్కడను కనుపించదు నిబోధనమే స్పష్టముగా నున్నది. 292
మరియును, హల్లుకు
శ్రీనాథుని కాశీఖండము (3-198)
శా.

పౌనఃపున్యమునన్ ఘటింపఁ దొడఁగెన్ బ్రహ్మాన్వయోత్తంస, గో
ష్ఠీనాగ్రంబున లేగపెయ్య యది కంటే కామధేనూద్భవం