పుట:Sukavi-Manoranjanamu.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మగువయొక్కతె చిమ్మె కోమలము మీఱ
కలిగి చూపుల నగగ శక్రాణి యపుడ
టంచుఁ జెప్పిన నిత్యసమాసయతులు
జనుఁ బ్రబంధాలి బాలశశాంకమౌలి!

248
ఇవి నిత్యసమాసయతులు గాని, వర్గయతులు మొదలయినవి గావు, కేశి, కేశవ పదములు మాత్రము అఖండయతి. ఇటువలెనె తెలుసుకొనేది. 249

20. కాకుస్వరయతి

లక్షణము
అనంతుని ఛందము (1-94)
క.

కాకుస్వరయతియగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వడించె ననఁగఁ బ్ర
శ్నాకలిత దీర్ఘమున నితఁ
డే కవ్వడి రథము గడపె నిమ్ముల ననఁగన్.

250
ఈ పద్యమందు 'ఇతడే' అను చోట ప్రశ్న అని చెప్పినారు గాని, (ఆ పదము) నిశ్చయార్థమును చెప్పుచున్నది గాని ప్రశ్నార్థమును చెప్పదు. రంగరాట్చందమున నీ పద్యములకు లక్ష్యము చెప్పిన పద్యము—
క.

వసుమతి రసికాగ్రణియై
యెసఁగిన యానందరంగఁడే బ్రోచు సుధీ
విసరముల నామహాత్ముని
యసమసమఖ్యాతి వింటిరా కవులారా!

251
మొదట నిశ్చయము, రెండవచోట నిబోధమును తెలుపుచున్నది. 252
(ఇక) కాకునూరి అప్పకవిగారు ఆంధ్రశబ్దచింతామణి (3-241,2) యందు
క.

వలుకుల తలఁగల వ్రాలకు
వలనగుచోఁ బ్లుతము నిలిపి వానికి రెండున్
వలులుగఁ జెప్పిన కావ్యం
బుల నది కాకుస్వరంబు ప్లుతవలియు నగున్.

253