పుట:Sukavi-Manoranjanamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వ్యంజనములు రెండును చెల్లునని లక్షణముచెప్పి, అట్టివే లక్ష్యములు వ్రాసినారు. (మరి) పూర్వ మహాకవి ప్రయోగములు ద్విత్వముగల పేరులకు ఉభయముకు (యతి చెల్లింపు) ఉండగా, గురుత్వ మొప్పకపోవుటకు వారి తాత్పర్యము తెలియదు.
అనంతుని ఛంధము (1-118) నందు—
గీ.

ఒరుల నన్నమ్మ యనుచోట నూదఁబడక
ద్వివిధమగుఁ బ్రభునామాంత విరమణమున
మఱి యయోధ్యకు రాజు రామన యనంగ
నతని పట్టపుదేవి సీతమ యనంగ.

(అని) రంగరాట్ఛందంబు (3-128) నందు—
గీ.

అవనిలో నలమేలు మంగమకు సాటి
యాదిలక్ష్మి, యానంద రంగనకు సాటి
విష్ణు, వటుగాన నోములు వేయు నోచి
మహిని నాతనిఁగన్న లక్ష్మమదె కీర్తి.

37
(అని చెప్పినారు) ఇటువలెనే కొందఱు గురుత్వ మొప్పలేదు. గురుత్వ మొప్పనివారికి గురుత్వములేదు. 38
గురుత్వముకు లక్ష్యములు
అచ్చుకు
తెనాలి మూర్తికవిగారి 'రాజవాహనవిజయము' (అవ. 1-22)
ఉ.

చెప్పిన పద్యమెల్ల చెవిఁజేర్చి వినున్ విన డొంకు గల్గినన్
దప్పులు గిప్పు లెన్నఁ డొకనాడును, నాడును నాడు వేడ చో
యప్పన పెట్టఁ బోఁ డడిగినన్ వివరా లిడు కొండమీఁది తి
మ్మప్పనివఁటి కావ్యపతి యబ్బుట యబ్బుర మిబ్బుధాలికిన్.

39
నంది తిమ్మనగారి చాటుధార
క.

ఇప్పటి దాతల సరిగాఁ
జెప్పకురా భట్టకర్ణ శిబిఖేచరులన్