పుట:Sukavi-Manoranjanamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాగమసంధి విభాగ నామాఖండ
             పంచమీ వికృతి విభక్తి యతులు
కాకు స్వరప్లుతాక్షరయుగ విశ్రామ
             ములు నన నుభయాఖ్య వెలయు వళులు
క్రమత శబ్దానుశాసన ప్రభృతి పూర్వ
కవిజనంబుల కృతుల లక్ష్యముల కలిమి
బదియు రెండువిధంబులై పరగుచుండు
దద్విధంబులు తెలియంగఁ దగు ముకుంద. (3-121)

9

—అని స్వర యతులు 7 వ్యంజనాక్షర యతులు 21, ఉభయ వళులు 12, ప్రాసయతి (1) లోగూడ నలుబదొకటి (యతిభేదములు) అప్పకవిగారు చెప్పినారు. పది మొదలుకొని ముప్పది పర్యంతమున్ను కొందఱు కొందఱు లాక్షణికులు చెప్పినారు అందటికన్న అప్పకవిగారే యెక్కువ చెప్పినారు గాని, ఈ నలువదొకటిలోను స్వరమైత్రి, ప్రాణి, ఋజ, ప్రత్యేక, భిన్న, ఏకతర, అంత్యోష్మ, మవర్ణ, యుష్మదస్మచ్ఛబ్ద - ఈ 9 యతులు పరిహరించబడినవి. [1]ఏమి హేతువనంటే10

  1. ఈ 9 యతులు పరిహరింపబడుటకు 'ఏమి హేతువనంటే-' అని కారణములు చెప్పుటలో 'యుష్మదస్మచ్ఛబ్దయతి'ని పరిహరించుట కారణము చెప్పబడలేదు. మరియు 'ఉభయముల'లో వేంకటరాయకవి 'యుష్మదస్మచ్ఛబ్ద' యతి నొకభేదముగా కూడా చెప్పినాడు. ఉభయయతులలో ఈయతి లక్ష్య లక్షణములు ప్రదర్శించి 'అప్పకవిగా రఖండయతి నొప్పరుగాన నిచ్చట దిద్దశక్యముగాక యుష్మదస్మచ్ఛబ్దయతులని పేరుంచినారు. ఇంతమాత్రముచేత నఖండయతికి లోపము రానేరదని ఉంచినాము' అని వ్రాసినాడు. అఖండయతిలో నిది అంతర్భవించు ననుకొని మొదట పరిహరింపబడినదని చెప్పి 'లోపము లేద'ని ఉంచుటచే నిక్కడ 8 యతులే పరిహరింపబడినవని భావించవలెను. మరియు ఈ 8 లో 'అంత్యోష్మ' మని పేర్కొనబడినది. 'అంత్యోష్మసంధి' యతి ఉభయయతులలో వేం. రా. కవి అంత్యోష్మసంధి యతిని చెప్పినాడు. మరియు వీటిని నిరాకరించు వరుసలో అంత్యోష్మసంధి నిరాకరణ హేతువు చెప్పబడలేదు. యుష్మదస్మచ్ఛబ్ద, అంత్యోష్మసంధి' తప్ప మిగిలినవాటినే నిరాకరించి 'ఈ సప్తవిధములు నామనిర్దేశములు మాత్రమే...' (2-17) అని చెప్పినాడు. కాన ఇక్కడ 9 అని చెప్పుటకు హేతువు కన్పించదు.