పుట:Sukavi-Manoranjanamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కనవలదు దాని లక్షణ
మును నీకది కల్గు చందమును విను మింకన్.
                                           (అ. క. పీఠి 38-41)

160


క.

ఇల నెనుబదిరెం డార్యలు
గలిగి పరిచ్ఛేదపంచకంబునఁ దగు నీ
విలసిత ఫక్కి మతంగా
చల విప్రుని వలన నీదు సదనము చేరున్.

161


క.

మును నారాయణ ధీరుఁడు
దనకు సహాయుఁడుగ సంస్కృతము వాగనుశా
సనుఁడు రచియించె దానిం
దెనిఁగింపఁగ నీకుఁదోడు నేనిపు డగుదున్.
                                         (అ. క. పీఠి 52-53)

162


క.

తాతనయు నూత్న దండియు
నీ తెనుఁగుల లక్షణం బొకించుక యైనన్
జేతః ప్రౌఢిమ చెప్పిరి
క్ష్మాతలమున దీని తెఱఁగు గావవి యెల్లన్.

163


గీ.

ఆంధ్రభాషామహాకాననాంతరమున
సంతసంబున శబ్దాపశబ్దసరణు
లెఱుఁగ నేరక మది సంశయించు తెలుఁగు
కవులు సుపథంబు లిందును గాంతు రిలను.
                                         (అ. క. పీఠి 59–60)

164

అని భగవంతులే చెప్పినారని అప్పకవిగారు చెప్పినారు. భగవద్గీత లెటు
వంటివో, అప్పకవి గీతలు నటువలె సకలజనములకు తోచగలందులకు చెప్పు
కొన్నారు. భగవదప్పకవు లిద్దఱు నేకమై రచించిన గ్రంథమందు నిటువంటి
సిద్ధాంతములు బహులములు గలవు. అక్కడక్కడ ప్రసక్తమైనపుడు
వ్రాసుతాము.165