పుట:Sukavi-Manoranjanamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చుట్టిన యెతులనుట రెండు. తకారద్విత్వము లేకపోవుట మూడు శంకలు
సాధారణముగా గనుపించుచున్నవి. భూషలనగా నగల కర్థము. నగలనగా
బంగారు, వెండి మొదలయిన వాటిచేత గుండ్రగాను, కోలగాను చేసిన వస్తు
వులు. ఆ వస్తువులలో శరీరరక్షకొఱకు వృక్షాదుల వేళ్లు మొదలైనవి వేసి
సికను, కంఠమందు, భుజముల, మొలను కట్టు(ట) లోకప్రసిద్ధము. ఆ
వస్తువులను తాయెదలని కొందఱు, తాయెతులని కొందరు తావేజులని కొందరు
ననుట కలదు. తిమ్మకవిసార్వభౌముడుగారు లక్షణసారసంగ్రహమందు
తాయెద అని వ్రాసినారు. పామరులు తావేజు లంటారు. అప్పకవిగారికి
ఉయ్యల మొదలయిన శబ్దములకు లేని పదద్వయవిభాగము సేయుటకు పొసగని
అర్థము వ్రాసుటకు సూత్రములు దిద్దుటకు నింతసామర్ధ్యము కలుగుటకు కారణ
మాయనే గ్రంథాదియందు స్పష్టము చేసినారు. భగవంతులు స్వప్నమందు
ప్రత్యక్షమగునప్పటి పద్యములు:156

క.

కరములు రెంటను దాల్చిన
పరికరములు చూచి యతనిఁ బరమేశునిగా
బరికించి లేచి వలగొని
మురియుచు సాష్టాంగదండము లొనర్చి వెసన్.

157


గీ.

మోడ్పుకేలు భాలమున జేర్చుకొనియున్నఁ
గరుణ నతఁడు నన్ను గాంచి పలికె
నన్నెఱింగి వందనం బొనర్చితి వాత్మ
మెప్పుపుట్టె నీదు మెలకువకును.

158


ఉ.

ఈ యువతుల్ రమాధరణు లేను పయోరుహపత్రనేత్రుఁడన్
నీయెడఁ గూర్మికల్గి ధరణీదివిజోత్తమ వచ్చినాడ స్వ
శ్రేయస మబ్బు నీకు నిక సిద్ధము నన్నయ ఫక్కి యాంధ్రముం
జేయుము మా యనుగ్రహముచే కవు లచ్చెరువంది మెచ్చగన్.

159


క.

వినియును గనియును నెఱుఁగని
ఘనఫక్కిం దెలుఁగు సేయఁగా నెట్లగు నా