పుట:Sringara-Malhana-Charitra.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కన్నప పుక్కిటినీటన్
గన్నప కీర్తెల్లఁ బాసెఁ గటకట, నేఁడీ
కన్నియ యధరామృతమును
గ్రన్ననగాఁ గవయుకతన గౌరీశునకున్.


గీ.

అనిన పలుకు చెవుల నాలించి ప్రాణేశుఁ
డౌట యెఱిఁగి యొయ్య నతనిఁ గదిసి
యెట్టు వచ్చి తిచటి కీవేళ యనుచును
ముదము భయము మదిని ముడివడంగ.


గీ.

బిగియఁ గౌఁగిలించి బింబాధరము చవు
లిచ్చి యిచ్చి క్రోలి యిచ్చ వగచి
ప్రాణనాథ, నీకుఁ బాడియె యొక్కఁడ
విట్టు లరుగుదెంచు టెఱిఁగి మఱియు.


సీ.

గ్రక్కునఁ దలవరుల్ గని పట్టుకొనిరేని
                   నరయ నాదోష మెవ్వరికిఁ దగులుఁ
బఱతేర నచ్చటఁ బాముఁ దే లంటిన
                   నాహత్య యెవ్వరి కతిశయిల్లు
మీతల్లిదండ్రు లోమియుఁ బుత్రశోకాగ్నిఁ
                   గన నది యెవ్వరి కొని మునుంగుఁ