పుట:Sringara-Malhana-Charitra.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నమరు రతిదేవి మెఱుఁగుటద్దమొ యనంగ
నిందుఁ డుదయించె లోచనానందముగను.


వ.

అంతట నామలహణుండును సంధ్యాదికృత్యంబులు దీర్చి పుష్పసుగంధిం దలంచి సుశీలుతోడ నిట్లనియె.


క.

ఉడుగని విరహానలమునఁ
బడి వడిఁ గడునొచ్చి మిగుల బడలినవారిన్
గెడగూర్చుకంటెఁ బుణ్యము
వడిఁ బాపఁ దలంచుకంటెఁ బాపముఁ గలదే.


గీ.

విరులు గంధంబు మిగులను వెట్ట యగును
చెలులమాటలు చెవులకుఁ జేఁదు లగును
ప్రాణపదమైన యంగనఁ బాయుకంటె
మఱియు దుఃఖంబు గలదొ యిమ్మహిఁ దలంప.


ఉ.

మక్కువఁ బుష్పగంధి పురమర్దనుసన్నిధి నాటలాడి తా
నిక్కువ కేఁగుదేరఁగ రతీశ్వరు పట్టపుటేనుఁగో యనన్