పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

శ్రీరామాయణము

తెలవాఱఁ దగువిధుల్ - తీర్చి మువ్వురును
కలశ సంభవుని జెం - గటఁ ేరవచ్చి
కరములు మొగుప రా - ఘవు మోముఁ జూచి
కరుణదైవార న - గస్త్యుఁడిట్లనియె.

-:అగస్త్యుఁడు గోదావరి తీరస్థపంచవటిని గుఱించి చెప్పుట:-


“శ్రీరామ! యీ రేయి - సీతతో నిచటి
యారామమున నిద్ర - నంది సౌఖ్యమున
దినకృత్యములు దీర్చి - తే నీకు నేఁడు
పనియెద్ది? వివరించి - పలుకుమా" యనిన
“మునినాథ! యెచ్చోట - మువ్వుర మేము
వనవాస మీడేర్ప - వసియింప వలయు 1070
తగిన చోటిది యని - తలఁచి మాతోడ
విగణింపు" మనిని న - వ్విమల మానసుఁడు
నొకకొంతసేపు తా - నూరకె తలఁచి
సకలజ్ఞుఁ డగు నగ - స్త్య మునీంద్రుఁడనియె
" జననాథ! రెండు - యోజనముల మేర
వనము చెల్వగు పంచ - వటియను పేర
నొక్కరమ్యస్థలం - బున్నది మీకు
నక్కడఁ గలుగు ని - ష్టార్థంబు లెల్ల
మేలెంచి దశరథు - మీఁది నెయ్యంబుఁ
బాలించి యచటికిఁ - బనిచెద మిమ్ము. 1080
మాయభీష్టము నీవు - మాయాశ్రమమున
జాయతో వసియింప - జాల సమ్మతము;
అటులయ్యు మీహృద - యముల వర్తనము