పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

శ్రీరామాయణము

చతురాననునకు నం -జలిఁజేసి నిలిచి
యతఁడు సేమము వేడ - నరలేక పల్కి
యాలోకమున నిశ్చ - లానంద సౌఖ్య
లోలుఁడౌ మౌని నా - లోకించి మెచ్చి
యున్నచో నయ్యాశ్ర - మోపాంత వనుల

—: దండకారణ్యములోని మునులకు శ్రీరాముఁ డభయదానమిచ్చుట :—


నున్నట్టి మౌనులు - యోగిపుంగవులు
పలుగురా ల్పొడిచేసి - భక్షించువారు
నిలివెఁడు నీటిలో - నెలకొనువారు
కొరుకుడు ధాన్యముల్ - గొనిమనువారు
కరవలి తమమేఁత - గానున్నవారు400
పుడమి మోవని దేహ - ములనుండు వారు
పడినట్టి పాటుగాఁ - బడియుండు వారు
యెత్తిన చేతుల - నేయుండు వారు
బిత్తరిం జలికోర్చి - పెనుపొందువారు
కలఁగక తలక్రిందు - గానుండు వారు
వెలుఁగు వహ్నులలోన - వెలుఁగొందువారు
పిడికెడు తిండిచేఁ - బేర్కల వారు
పుడిసిటి మాత్ర మం - బులుగ్రోలు వారు
కందమూలముల నాఁ - కలి దీర్చువారు
నందిత జీర్ణ ప - ర్ణము లాను వారు410
గరికెవ్రేళ్లు మెసంగి - క్రమియించువారు
కురకుర చిదిపిరాల్ - గ్రోలెడువారు