పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

474

శ్రీరామాయణము

చనినఁ బ్రభాకర - సంతతిం జూచి
అనఘాత్మకుఁడు లక్ష్మ - ణాగ్రజుఁ డనియె
“ఏ రీతి నెఱిగితి - వీ విశ్వ మెల్లఁ?
దీఱునే యొరుల కీ - తెఱపు లేర్పఱుప?
ఎన్నడు చూచితి? - వెవ్వారిచేత
విన్నావు? దివ్య వి - వేకమౌఁ గాక!
పూసగ్రుచ్చిన యట్లు - భుజపత్రికలను
వ్రాసి పారము సేయు - వైఖరిఁ జిత్ర
పటము చెప్పిన యట్లు - పటుబుద్ధి చేత
నెటువలె వాకొంటి? - విన్ని దిక్కులను!4780
చూచిరేనియు నవి - సులభమే మదికి
గోచరించి వచింపఁ - గూడునే యట్లు?
ఇంత ప్రజ్ఞాశక్తి - యేరీతిఁగలిగె?
నంతయు వివరింపు" - మన రాముఁ జూచి
కరములు ముకుళించి - కలయట్టిరీతి
తరణితనూజుఁ డం - తయు విన్నవించె.

-: సుగ్రీవుఁడు రామునకు సీతను వానరులు వెదకిన విశేషములను చెప్పుట :-

"అయ్య! దుందుభికి మా - యన్నకు మొదట
కయ్యంబు నడచిన - కార్యమంతయును
విన్నవించితి గద - విబుధుఁడై యున్న
నన్ను మావాలి మి - న్నక యాగ్రహించి 4790
తరిమిన నతనిచే - దాడికిఁ గాక
కొఱవి ద్రిప్పిన యట్లు - కుంభిని యెల్ల