పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిష్కింధా కాండము

421

తనమంత్రివరుల నం - దఱఁ జూచి తగవు
గురులఘుత్వమ లన్య - గుణ గౌరవంబుఁ
బరికించి తానున్న - పట్టెమంచమున
నుండక దిగువఁ గూ - ర్చుండి వివేక
పాండిత్య శాలియై - భానుజుఁడనియె. 3500


-: సుగ్రీవుఁడు లక్ష్మణుడు వచ్చిన కార్య మడుగుట :-

"రామున కేను నే - రము సేయలేదు
తామసింపను మితిఁ - దప్ప మేమఱచి
యేమి నిమిత్తమై - యింతకోపమున
సౌమిత్రి వచ్చె నే - సదనంబుఁ జేర
నెవ్వరేనియు వాలి - హితులు వంచించి
దవ్వుల నేనున్కి - దగనివాఁడనుచుఁ
జెవిసోఁక కొండెముల్ - చెప్పిరో కాక
చెవులె కన్నులుగదా - క్షితిపాలకులకు!
అతఁడు స్వకార్య ప - రాయణుఁడగుట
హితమతి మీకార్య - మీ డేర్తుననుచు3510
నానమాట యొకింత - యాడినజాలు
దోసమెంచక యొక్క - తూపు సంధించి
పంతగించిన యట్ల - పడవేసెనేని
చింతించి యామీఁదఁ - జేసెడి దేమి
నామాట వినియొక్క - నారాచ మేర్చి
రాముఁడు వాలి నూ - రక చంపలేదె?
ఎవ్వఁడెఱుంగు? నా - కీరాజ్య మేల?
దవ్వులఁ బ్రాణముల్ - దాఁచి యుండెదను