పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకాండము

233

నిలపట్టికై రాముఁ - డిట్లని పలికె.
వినుము "లక్ష్మణ! నాదు - విశిఖరాజంబు
ధనువుతో నిపుడు సం - ధానంబు సేయ 5550
జనులకు ముదిమియుఁ - జావునుఁ బుట్టు
వును గాలమును గర్ము - వును దప్పనట్లు
తప్పదు చూడ మి - త్తరి పర్ణశాల
యిప్పుడున్నదొ లేదొ - యింటిలో సీత!
తొడుగగునే నాదు - తూపని" పలికి
కడునల్కతో లయ - కాలాగ్నిరీతి
పగలింటి సూర్యుని - పగిది నున్నట్టి
జగదేకవీర కౌ - సల్యాకుమారు
రామచంద్రుని పాద - రాజీవయుగళిఁ
దా మౌళిఁ గీలించి - తలఁకి వేలేచి 5560
యమ్ము సంధించిన - యన్న కేల్వట్టి
సమ్మతపఱప ల - క్ష్మణుఁ డిట్టులనియె.

—: లక్ష్మణుఁడు రామచంద్రుని శాంతింపఁజేయుట :—



"స్వామి! కృపాపర - జలధివి, శాంత
భూమికుండవు, సత్య - బోధాత్మకుఁడవు,
సకలసంరక్షణ - శాలివి, నీకు
నొక సీతకై యిట్టి - యుగ్రభావంబు
తగునయ్య? ఏనిమి - త్తముగఁ గోపించి
జగతి జీవుల నెల్లఁ - జంపఁ బూనితివి?
చంద్రుని చలువ భా - స్కరుని వేడిమియు
నింద్రుశౌర్యంబు మ - హిక్షమాగుణము 5570