పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

శ్రీరామాయణము

యప్పుడు రావణుఁ - డానిశాచరుఁడు
దనకిచ్చు పూజలఁ - దనిసి యున్నంత
గనుఁగొని వాఁడు రా - క్షసరాజుఁ బలికె.
"ఇప్పుడే వచ్చితి - విటమున్నె పోతి
విప్పుడు మరలిరా - నేటికి నీకు?
మీకందఱికి సుఖ - మేకద? యేమి
వాకొన వచ్చి రా - వణ! చేరినావు?
మదిఁగలఁగెడు నాకు - మాటక తెలుపు
మిది" యన్న విని దాన - వేశ్వరుఁ డనియె.

-:రావణుఁడు సీతాపహరణమున మారీచుని సహాయముఁ గోరుట:-



"ఓయి! మారీచ! నీ - వొకడవేకాక3020
యేయెడ వెదకిన - నేఁ బ్రాపుఁ గాన!
ఖరదూషణాది రా - క్షసుల నందఱును
నరుఁ డొక్కఁ డెదురుగా - నక సంహరించె
జడియక మన జన - స్థానంబు చెఱిచి
కడులావుతో దండ - కాననంబునను
బదునాల్గువేలైన - పలల భోజనులఁ
జిదిమి వైచితిని - మీచింతలుదీరె"
ననుచు బీరములాడి - యందలిమునులు
తను మెచ్చ తమ్ముఁడు - దాను నున్నాఁడు
అందుపైఁ దనకది - యాలని యొక్క 3030
సుందరిఁ దెచ్చియుం - చుక యున్నవాడు
రాముఁడు మిగుల దు -ర్జనుఁడు మూర్ఖుండు