పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135

శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రి యాదిష్ఠానంబగు చర్మంబు

పుట్టె. దానివలన రోమంబు లుదయించె. వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె. అందు నధిగత స్పర్శ గుణుండును అంతర్బహిఃప్రదేశంబుల నావృతుండును నగు వాయువు వలన

(బలవంతంబులు నింద్రదేవతాకంబులు నాదాన సమర్థంబులు నానాకర్మ కరణ దక్షంబులు నగు హస్తంబు లుదయించె.) స్వేచ్ఛా విషయగతి సమర్థుండగు నీశ్వరునివలన విష్ణుదేవతాకంబులగు

పాదంబు లుదయించె. ప్రజానందామృతార్థి యగు భగవంతుని వలనఁ బ్రజాపతి దేవతాకంబై స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు కార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె. మిత్రుండధిదైవ

తంబుగాఁ గలిగి భుక్తాన్న ద్యసారాంశ త్యాగోపయోగం బగు పాయు వనెడి గుదం బుద్భవించె. దాని కృత్యం బుభయ మల మోచనంబు, దేహంబున నుండి దేహాంతరంబు జేరంగోరి

పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభి ద్వారంబు సంభవించె. అట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనంబడు. తద్బంధ విశ్లేషంబె మృత్యు వగు. అదియు యూర్థ్వాధో దేహ భేదకం

బనియుం జెప్పంబడు. అన్న పానాది ధారణార్థంబుగ నాంత్ర కుక్షి నాడీనిచయంబులు గల్పింపఁబడియె. వానికి నదులు సముద్రంబులు నధిదేవతలయ్యె. (వాని వలనఁ) దుష్టిపుష్టులను నుదర

భరణ రస పరిణామంబులును గలిగియుండు. ఆత్మీయ మాయా చింతనం బొనర్చు నపుడుకామ సంకల్పాది స్థానంబగు హృదయంబు గలిగె. దానివలన మనంబును, చంద్రుండును,

కాముండును, సంకల్పంబును నుదయించె. అంత మీఁద జగత్సర్జనంబు సేయు విరా డ్విగ్రహంబు వలన సప్తధాతువులును, పృథివ్యప్తేజోమయంబులైన సప్తప్రాణంబులును,వ్యోమాంబు

వాయువులచే నుత్పన్నంబు లయి గుణాత్మకంబు లైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబులైన గుణంబులును, సర్వవికార స్వరూపంబగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియుఁ

బుట్టు. వివిధంబగు నిది యంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు, మఱియును, (270)


క. వరుస బృథివ్యా ద్యష్టా, వరణావృతమై సమగ్ర వైభవములఁ బం

కరుహభవాండాతీత, స్ఫురణం జెలువొందు నతివిభూతి దలిర్పన్. (271)


క. పొలుపగు సకల విలక్షణ, ములు గలి గాద్యంత శూన్యమును నిత్యమునై

లలి సూక్ష్మమై మనో వా, క్కులకుం దలపోయఁగా నగోచర మగుచున్. (272)