పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

శ్రీ వేంకటేశ్వర వచనములు


గర్వాపహరణంబును, గోవర్ధనగిరి యెత్తుటయును, గోనిర్మితంబును, గోపాంగనా జారత్వంబును, గంస శిశుపాల నరకాసుర 'బాణాసురాది దుష్ట నిగ్రహంబును, ద్వారకా నిర్మితంబును,నర్జునసారథిత్వంబును, దుర్యోధనకులాంతకంబును, విదురా క్రూర ముచికుందాదీ భక్తజన కటాక్ష వీక్షణంబును,గల్క్యవతారంబున దుష్టనిగ్రహంబును, శిష్టప్రతి పాలనంబును, వర్ణాశ్రమ ధర్మంబులు నిర్ణయించుటయును, నిట్లు యుగయుగంబుల నవతారంబు లెత్తి ధర్మంబు నిర్వహించుటయును, సర్వజీవ దయాపరత్వంబునం దామ్ర శిలా మృణ్మయ దారువులందుల నుండి భక్తుల రక్షించుటయు, మఱియు గృహే గృహే తిరువారాధన రూపంబులై వెలసి భక్తులఁ గటాటింపుచుండుటయు జరపుదు వనిన నీ ప్రభావంబు లేమని వర్ణింపవచ్చును. అణు రేణుతృణకాష్ఠ పరిపూర్ణుండవై నిండియుండుదువట ! ఇటువంటి నీప్రతాపంబులు విని యిందున నొక యుపాయంబుఁ జింతించితిని. నకల జీవులయందును బరిపూర్ణుం డవు కనుక, నాయందు నీవుండుటం జేసి నాచేయు కృత్యా కృత్యములు నీవే చేయుటగా, నీకే ప్రీతియని నిశ్చయించి, యన్ని నేరములను నీ మీఁదనే మోపి నేను తేరకాఁడ నయితిని. కర్తా భోక్తా జనార్దన యను శ్రుతివచనము ప్రకారమునఁ జేకొని, నన్నఁ గటాక్ష వీక్షణంబుల నీ దాసానుదాసునిఁగా నెంచి రక్షింపుము. శ్రీ వేంకటేశ్వరా !