పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

57


127

గోపాలబాలకా ! నిన్ను నేఱుంగనిశుష్క జ్ఞానంబు పాషాణ కంటక క్రూరసర్ప వరాహ శార్దూల భల్లూకాక్రాంతంబైన యరణ్య మధ్యంబువంటిది. ఈ దేవాలయంబులు లేనిచోట్లు కఠిన కర్కశతిమిర దురవగాహపిశాచశునకావాసంబుల వంటివి. మీకు విరహితంబులైన పూజలు నిబిడ నిర్ఘాత విద్యుత్పాత జంఝామారుతవర్గంబులైన సముద్ర మధ్యంబులవంటివి. మీ కథలు లేని పురాణ శ్రవణంబులు భీకరాకార కాకమూకకంకగృద్ర ఝల్లీ పాషాణ గుహలలోని ప్రతిధ్వనులవంటివి. ఇవి యెల్ల ను మహాత్ములగువారు దలంపరు. 'మిమ్ము నమ్మి సర్వశుభం బులు మాయం దె ఘటియించుకొందురు. వివేకు లయిన మీదాసులకు నిదియె యుపాయంబు, శ్రీ వేంకటేశ్వరా !

128

పూతనాశిక్షకా ! గ్రహణకాలంబునంజేసిన స్నానంబునకు గంగాస్నా నంబు సరియని చెప్పుదురు. పుణ్య క్షేత్రంబుల నుండెడివారిని ఋషి సమాను లనీ యంద్రు. సత్పురుషు లైనవారి హస్తంబునం బెట్టిన సువర్ణంబు మేరుసమానంబని పలుకుదురు. కాలకృతంబులై న యనుష్టా నంబులు సఫలంబులని వచియింతురు. అన్నిటి మాహాత్మ్యంబు మీయం దే యున్నది. గంగాజలంబు మీపాదతీర్థంబు. ఋషిత్వంబు మిదాస్యంబు. దానఫలంబైన సువర్ణంబు శ్రీమహాలక్ష్మి ప్రసాదంబు, అనుష్టానజపం బులు మీనామస్మరణ సులభంబులు. ఇన్ని యును మీవలననే మాకు సిద్దించె. ఇన్ని టం బరిపూర్ణులమై యున్నారము. వెన్న చేతఁ బెట్టుకొని నేతి కై వెదక నేమిటికి ? పరుసవేది యింట నుండగా బంగార మడుగ వలెనా ? మాకు మీరు గలరు. ధన్యులమైతిమి శ్రీ వేంకటేశ్వరా !

129

లోకనాథా ! నేను జ్ఞానం “బెవరినై న నడిగి తెలిసికొనియెద నంటినేని శాస్త్రాధీనుండు బ్రాహ్మణుండు. గృహస్థుండు పుత్ర మిత్ర కళత్రా