పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

శ్రీ వేంకటేశ్వర వచనములు



ధీనుండు. రాజు రాష్ట్రాధీనుండు. ప్రధాని కార్యాధీనుండు, జపిత మంత్రా ధీనుండు. తపస్వి దై వాధీనుండు. ఈరీతిని వారు వారు మనస్సులు తమ తమ కర్మంబులందే యొడంబడ వర్తింతురు. కాని నిన్ను నొక్కనినే కొలిచి తేను నీవలన నన్నియుం గలవనియెడు విశ్వాసంబు వారికిఁ గలుగ నేరదు. వారు నన్ను నెట్లు బోధించెదరు. విత్తోకటి పెట్టినఁ బెట్టు వేఱో క్కటి మొలచునా ? అవి నీకృత్యంబులు. నేను వైష్ణవుండను. ఆచార్యా ధీనుండను. నీవు భాగవతాధీనుండవు. నన్నుం గరుణా దృష్టి, నవలోకిం పవే. శ్రీ వేంక టేశ్వరా.

130

ఆదిమధ్యాంతరహితా ! ఆకాశంబున భూమిం బురుడింప వచ్చును. అనంతమైన నీమహిమకు నీడు లేదు. సముద్రంబు సెంచి మేరుపర్వ తంబుఁ బోలించవచ్చు. నీకరుణా సముద్రంబునకు సరి చెప్ప నలవిగాదు. సూర్యుని తోడఁ జంద్రుని జోడు చెప్పవచ్చును. నీ కోటిసూర్య తేజం బునకుం బ్రతి లేదు. బడబాగ్ని నగ్ని దేవునిఁ బోల్పవచ్చును. నీప్రతా పాగ్నికి సాటి యుపమింపరాదు. చుక్కలను జ్యోతిశ్శాస్త్రంబుల లెక్కింపవచ్చునుగాని యపారంబైన నీ నామంబుల ప్రభావంబులకు నేమియు మితి వెట్టరాదు. ఏకోదకంబై నపుడు నీవొక్కడవే నారాయ ణుండనై యుండుదువట నీకు నీవే యీడు. ని న్నెంతని కొనియాడు దుము. అందఱకు నీ వొక్కరుండవే గతి. శ్రీ వేంకటేశ్వరా !

131

భక్తచింతామణీ ! నేను విలాససంకల్ప బాధితుండనై యజ్ఞానం బనీ యెడియగాథ. జలంబులలోన మాయావర్సాగమనంబునం దపంబు సేయు చున్న వాఁడ. అంగ నాలింగ నాకాశ మధ్యంబుననుండి వదన చంద్రునిపై దృష్టినిలిపి 'యూర్థ్వబాహుండనై తపస్సు చేయుచున్న వాఁడ, అష్టాశీతి బంధంబుల యాసనంబులనుండి మదనదై వతాగమంబున నిట్టూర్పుల ప్రాణాయామంబులం దపంబు చేయుచున్న వాడ. క్రోధాగ్ని పాత కేం ధనంబులు దరికోల్పి తపంబు సేయుచున్న వాడ. ద్రవ్యార్జనచింతాది