పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


ఆలగోలును గగ్గోలు బాలగోలు
కంటఁబడకుండ భూములఁ గాచినారు
రాజమా రాత్రులే దావిడ ప్రభువు తెల్ల
నిఖిలలోకైక కల్యాణ నిలయు లైరి.


అన్న మో రామచందా ! యంచు నారాట
             పడి యంగలార్చెడి వారు లేరు
చినిఁగిపోయిన చీర చెఱఁగోక్కటియు లేక
               ప్రాతకై యర్థించు వారు లేరు
దిన వేచ్చమునకునై దేవులాడుచును గ
                వ్వయుఁగూడ యాచించు వారు లేరు
చేసాచి యడిగిన సీ లేదు పొమ్మంచు
                  బదరించి మాటాడు వారు లేరు

డ్రవిడరాష్ట్రములందెల్ల సవిటి చెవిటీ
గూని గ్రుడ్డి వారొకరైనఁ గానరారు
రాజనూతులే ద్రావిడ ప్రభువు లెల్ల
నిఖలలో కైక కల్యాణ నిలయు లైరి.


గుడులఁ గట్టించి గోవుర కోటితోడ
మంచి మడిమాన్యములు సమర్పించి యధిక
దైవభక్తిఁ జూపించిరి దేవళముల
ద్రవిణమంతయు వెచ్చించి ద్రవిడనృపులు,

75