పుట:Shriiranga-mahattvamu.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

237


పరసతీకుచకుంభపరిరంభనిరతులు,
విష్ణుమంగళకథావిముఖమతులు,


తే.

నైన పాపాత్మకులు వీర, లట్లుగాన
వెమ్ముచున్నారు నరకాగ్ని విపులశిఖలఁ,
గరుణ భావించి నాకును గాచి పంప
రాదు, విధికల్పితంబు నిరాకరించి.

139


వ.

అనిన గృతాంతునకు నమ్మహీకాంతుం డిట్లనియె.

140


ఆ.

సకలజంతుసమితి సుకృతదుష్కృతములు
నీ వెఱుంగుదేని, నేనొనర్చు
నట్టిపుణ్య మెద్దియైనను గల్గిన
నంతవట్టు నాకు నానతిమ్ము.

141


చ.

అనుడు పరేతనాధుఁ డహిమాంశుకులోద్భవుఁడైన యవ్విభుం
గనుఁగొని నీచరిత్రము జగన్నుతిమంతము సర్వలోకపా
వన భవదీయకీర్తిసురవాహిని నీవు సమస్తపుణ్యవ
ర్తనులకు నెల్ల మేటివి, కరస్థము లారయఁ బుణ్యలోకముల్.

142


చ.

వ్రతములలోఁ బ్రశస్తము ధ్రువంబుగ మానవనాథ ద్వాదశీ
వ్రతమది నీవు నిష్ఠ నొకవత్సర మర్ధిఁ జరించినాఁడ వూ
ర్జితమగు నమ్మహత్వమునఁ జేసి భవద్భవసంచితాఘసం
తతి లయమొందెఁ దత్ఫలమితం బది యెంతని చెప్పవచ్చునే!

143


చ.

అనిన నృపాలుఁ డిట్లనియె నర్కజ! యీనరకాగ్నులందు వే
దనఁ బడువీర లిందఱు ముదంబున సద్గతి కేఁగునట్లుగా
నెనయ మదీయపుణ్యమును నిచ్చెద నేనొక కొంత నీవు చె
ప్పినగతి నంతవట్టు వినిపింపుము నావుడు ధర్ముఁ డిట్లనున్.

144


ఉ.

భానుకులావతంస! యొకపారణ నీ వుపవాసముండఁగా
నైనఫలంబు వీరికి దయామతి నిచ్చినఁ దీవ్రయాతనల్